వరంగల్ లో వెలుగు చూసిన భార్య, ఇద్దరు బాలికల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో భర్తనే ప్రధాన నిందితుడు కాగా… సహకరించిన మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ నగర కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు అజారుద్దీన్ అదే గ్రామానికి చెందిన ఫరహాత్ను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి హుమేరా(09), ఆయేషా(06) జన్మనిచ్చారు. కాని నిందితుడి కుటుంబ సభ్యులకు కుమారుడు పుట్టాలని కోరిక ఉండేది.
వెలుగులోకి సంచలన విషయాలు…
2021, 2022 సంవత్సరాల్లో మృతురాలు గర్భం దాల్చడంతో తిరిగి అడపిల్ల జన్మనిస్తుందనే అపనమ్మకంతో అబార్షన్ చేయించారు. ఇందుకు ఆర్ఎంపీ డాక్టర్ నరేశ్, ల్యాబ్ టెక్నిషియన్ మనోహర్, డాక్టర్లు రవళి, పూర్ణిమతో పాటు నర్సు స్రవంతి సాకారం తీసుకున్నాడు. భార్యకు ఇష్టం లేకున్నా రెండు దఫాలుగా నిందితుడు అబార్షన్ చేయించాడు.
ఇదే సమయంలో దూరపు బంధువు అయిన మరో మైనర్ బాలికను పెళ్లి చేసుకునేందుకు భర్త అజారుద్దీన్ సిద్ధమయ్యాడు. కానీ సదరు నిరాకరించింది. అప్పటికే పెళ్లికావటంతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించింది. భార్య, పిల్లలు ఉన్నారనే కారణంగానే పెళ్లికి అంగీకరించలేదన్న కారణంతో… అజారుద్దీన్ మరో ప్లాన్ వేశాడు. భార్యతో పాటు పిల్లలను లేకుండా చేయాలని భావించాడు.
ఇదే సంవత్సరం మార్చి నెలలో ఫరహాత్ మరోసారి గర్భం దాల్చింది. అయితే మళ్లీ కూడా ఆడపిల్ల జన్మనిస్తుందనే భయంతో నిందితుడుతో పాటు తల్లిదండ్రులు, తమ్ముడు అబార్షన్ చేయించుకోవాల్సిందిగా పలుమార్లు ఫరహాత్ తో గొడవ పడ్డారు. అంతేకాకుండా మరో పెళ్లి కావాలంటే వీరిని లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు.
స్విమ్మింగ్ పూల్ కు తీసుకెళ్లి…
ఇందుకోసం నిందితుడు తాను అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈనెల 1వ తేదీన రాత్రి 7.50 గంటలకు ఐస్ క్రీం తినిపిస్తానని నమ్మించి భార్య పిల్లలను తాను నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్ వద్దకు కారులో తీసుకెళ్లాడు. ప్రణాళిక ప్రకారం ముందుగానే స్విమ్మింగ్ పూల్ వద్ద సీసీ కెమెరాలు, కరెంట్ నిలిపి వేశాడు. బలవంతంగా భార్యతో పాటు పిల్లలను నీటిలోకి తోసేశాడు. ఈ ముగ్గురు చనిపోయారని నిర్ణయించుకున్న తర్వాత… భార్య పిల్లలు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందారని ప్రచారం చేశాడు.
{{/usCountry}}ఇందుకోసం నిందితుడు తాను అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈనెల 1వ తేదీన రాత్రి 7.50 గంటలకు ఐస్ క్రీం తినిపిస్తానని నమ్మించి భార్య పిల్లలను తాను నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్ వద్దకు కారులో తీసుకెళ్లాడు. ప్రణాళిక ప్రకారం ముందుగానే స్విమ్మింగ్ పూల్ వద్ద సీసీ కెమెరాలు, కరెంట్ నిలిపి వేశాడు. బలవంతంగా భార్యతో పాటు పిల్లలను నీటిలోకి తోసేశాడు. ఈ ముగ్గురు చనిపోయారని నిర్ణయించుకున్న తర్వాత… భార్య పిల్లలు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందారని ప్రచారం చేశాడు.
{{/usCountry}}మృతిరాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు… తమదైన శైలిలో విచారణ జరిపారు. భర్త అజారుద్దీనే… తన భార్య పిల్లలలను దారుణంగా హత్య చేసినట్లుగా నిర్థారణకు వచ్చారు. అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అంతేకాకుండా ఈ కేసులో పున్నెలు గ్రామానికి చెందిన యం.డి చాంద్పాషా(49), యం.డి సలీహా(45), యం.షరోద్దీన్ (25)లతో పాటు బసిక స్రవంతి(32), బాల్నె పార్ధు(47) బొమ్మెర మనోహర్(39), లింగాల నరేష్(37), సాట్లరాజు(32), పున్నెలు, భద్రు(60)ను అరెస్ట్ చేశారు, మరో ఇద్దరు ( డాక్టర్ బాల్నె పూర్ణిమ, డా.ఎస్.రవళీ) పరారీలో ఉన్నారని సీపీ వివరించారు.