ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల దాటికి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుల్లోని నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మరికొన్నిరోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండే అవకాశం స్పష్టంగా ఉంది. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కూడా క్రమంగా నిండుతోంది.
సాగర్ లో ప్రస్తుత పరిస్థితి ఇలా….

ఇవాళ(జూలై 4) ఉదయం రిపోర్ట్ ప్రకారం…నాగార్జున సాగర్గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులుగా ఉంటుంది. ప్రస్తుతం 520.3 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ మొత్తం నీటి సామర్థ్యం 312.05 కాగా…. 151.66 టీఎంసీల వద్ద ఉంది. ఇన్ ఫ్లో 49,553 క్యూసెక్కులుగా ఉండగా… ఔట్ ఫ్లో 5,153 క్యూసెక్కులుగా ఉంది. గతేడాది మాదిరిగానే…. ఈసారి కూడా ఆగస్టు మొదటి వారంలోనే సాగర్ కాల్వలకు నీటిని విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది.
మరోవైపు శ్రీశైలండ్యామ్లో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.9 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 167.88 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 76,841గా ఉండగా…. ఔట్ ఫ్లో 68,118 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు
శ్రీశైలం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంటుంది. ఫలితంగా శ్రీశైలండ్యామ్ నిండడానికి తక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఎగువ రాష్ట్రాల్లోనే కాకుండా ఏపీలోనూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో…. శ్రీశైలం ప్రాజెక్ట్ ఈసారి ముందుగానే నిండటం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం… ఆదివారం క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. 156.33 అడుగుల నీటిమట్టం ఉంది. 21.53 టీఎంసీల నీటి నిల్వ ఉంది.ఇన్ ఫ్లో నిల్ ఉండగా… ఔట్ ఫ్లో 4,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి స్వల్పంగా వరద నీరు చేరుతోంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లోని నీటిమట్టం వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
{{/usCountry}}ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. 156.33 అడుగుల నీటిమట్టం ఉంది. 21.53 టీఎంసీల నీటి నిల్వ ఉంది.ఇన్ ఫ్లో నిల్ ఉండగా… ఔట్ ఫ్లో 4,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి స్వల్పంగా వరద నీరు చేరుతోంది.