కట్టుకున్న భార్యే దారుణం చేస్తే, ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన అర్ధాంగే అంతమొందించే హంతకురాలిగా మారితే.. అంతకంటే ఘోరం మరొకటి ఉండదు. పెళ్లి నాడు అగ్నిసాక్షిగా కట్టిన మూడు ముళ్లు, ఏడడుగుల బంధాన్ని కాలరాస్తూ.. ఓ మహిళ పరాయి వ్యక్తి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. అదీ వింటేనే ఒళ్లు గగుర్పొడిచేలా, అత్యంత క్రూరమైన పద్ధతిలో ప్రాణాలు తీసింది. ఈ కిరాతక ఉదంతం నిజామాబాద్ నగర శివారులోని న్యాల్కల్లో వెలుగుచూసింది.

పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. న్యాల్కల్కు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. భర్త దూరంగా ఉన్న సమయంలో అతడి భార్య సంధ్య.. అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కష్టపడి సంపాదిస్తూ భార్య, పిల్లల భవిష్యత్తు కోసం కలలు కన్న ప్రశాంత్, ఇటీవలె గల్ఫ్ నుండి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.
అయితే భర్త రాక సంధ్యకు సంతోషాన్ని ఇవ్వకపోగా తన అక్రమ బంధానికి అతడు అడ్డుగా మారాడనే కక్షను పెంచింది. పరాయి వ్యక్తి వ్యామోహంలో మునిగిపోయిన ఆమె, కన్నబిడ్డల భవిష్యత్తును కూడా మరిచి కట్టుకున్నవాడిని వదిలించుకోవాలని ఒక కఠినమైన పథకాన్ని రచించింది.
తన ప్లాన్ను అమలు చేయడానికి సంధ్య.. స్థానికుడైన వెంకట సాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయం తీసుకుంది. పక్కా స్కెచ్ ప్రకారం మొదట ప్రశాంత్తో బంటి కలిసి మద్యం సేవించాడు. ప్రశాంత్ పూర్తి మత్తులోకి జారుకోగానే, మేడపై నుండి కిందకు తోసేశారు. కింద పడటంతో ప్రశాంత్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోరాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించేందుకు సంధ్య నాటకమాడింది. ఏమీ తెలియనట్లు నటిస్తూ భర్తను మొదట ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది.
అంతటితో ఆమెలోని క్రూరత్వం చల్లారలేదు. ఆసుపత్రి బెడ్పై మృత్యువుతో పోరాడుతున్న భర్త ఎలాగైనా చావాలని డిసైడ్ అయింది. ఎవరూ లేని సమయం చూసి, అత్యంత దారుణంగా టాయిలెట్ క్లీనర్గా వాడే హార్పిక్ లిక్విడ్ను సిరంజి ద్వారా భర్త నరాల్లోకి ఎక్కించింది. ఆ రసాయనం నరనరాన పాకడంతో ప్రశాంత్ తల్లడిల్లిపోతూ ప్రాణాలు విడిచాడు.
{{/usCountry}}అంతటితో ఆమెలోని క్రూరత్వం చల్లారలేదు. ఆసుపత్రి బెడ్పై మృత్యువుతో పోరాడుతున్న భర్త ఎలాగైనా చావాలని డిసైడ్ అయింది. ఎవరూ లేని సమయం చూసి, అత్యంత దారుణంగా టాయిలెట్ క్లీనర్గా వాడే హార్పిక్ లిక్విడ్ను సిరంజి ద్వారా భర్త నరాల్లోకి ఎక్కించింది. ఆ రసాయనం నరనరాన పాకడంతో ప్రశాంత్ తల్లడిల్లిపోతూ ప్రాణాలు విడిచాడు.
{{/usCountry}}మొదట ఇదొక ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా అందరూ భావించారు. కానీ ప్రశాంత్ మృతిపై అనుమానాలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వెంకట సాయి అలియాస్ బంటిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు నిజాలు ఒప్పుకోవడంతో ఈ దారుణ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.
పరాయి వ్యక్తి మోజులో పచ్చేని సంసారాన్ని కూల్చుకుని, భర్తను నరకయాతన పెట్టి చంపిన భార్య సంధ్యతో పాటు, ఈ హత్యకు సహకరించిన మిగతా నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. క్షణిక సుఖాల కోసం కట్టుకున్నవాడిని పొట్టనబెట్టుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.