చీమలకు భయపడి ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య - అమీన్ పూర్ లో ఘటన

చీమల ఫోబియాతో బాధపడుతున్న ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పుర్‌లో చోటు చేసుకుంది. చీమలతో బతకలేకపోతున్నానంటూ రాసిన సూసైడ్ నోట్ దొరికింది.

Published on: Nov 6, 2025, 16:22:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చీమల ఫోబియాతో బాధపడుతున్న ఓ వివాహిత… ఆత్మహత్యకు పాల్పడింది. భర్త డ్యూటీకి వెళ్ళిన సమయంలో ఇంట్లోని ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

చీమలకు భయపడి వివాహిత  ఆత్మహత్య..! Representational Image
చీమలకు భయపడి వివాహిత ఆత్మహత్య..! Representational Image

ప్రాథమిక వివరాల ప్రకారం…. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పీఎస్ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో శ్రీకాంత్, మనీషా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ చిన్నారి కూడా ఉంది. చిందం మనీషా(25)కు చీమల ఫోబియా (మైర్మోకోఫోబియా) ఉంది. పలుమార్లు ఆస్పత్రిలో కూడా చూపించారు.

ఈ నెల 4న ఉద్యోగ నిమిత్తం భర్త విధులకు వెళ్లి వచ్చేసరికి తలుపులకు గడియ పెట్టి ఉంది. స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా మనీషా ఇంట్లోని ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని కనిపించింది. అదే గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. “ఐయాం సారీ… అన్నికా జాగ్రత్త. అన్నవరం, తిరుపతి హుండీలో రూ.1116 వేయాలి. అలాగే ఎల్లమ్మకు వడి బియ్యం పోయడం మర్చిపోకండి” అని లేఖలో రాసి ఉంది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే మనీషాకు చిన్నప్పటి నుంచే చీమలు అంటే భయం ఉన్నట్లు తెలిసింది. మంచిర్యాలకు చెందిన మనీషా… శ్రీకాంత్(35)ను 2022లో వివాహం చేసుకుంది. వీరికి అన్నికా(3) కూతురు ఉంది. వీరు గత రెండు సంవత్సరాలుగా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్య హోమ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More