అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(AGICL), అమరావతిలోని నెలాపాడు సమీపంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసం నిర్మాణం కోసం, డిజైన్-బిల్డ్ లంప్-సమ్ కాంట్రాక్టు పద్ధతిలో రూ.14 కోట్లకు పైగా విలువైన పోటీ టెండర్ను ఆహ్వానించింది. ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టులో రెండేళ్ల లోప బాధ్యత కాలం(Defect Liability Period) కూడా ఉంది. ఈ కాలంలో కాంట్రాక్టర్ లోపాలను సరిదిద్దడం, నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడం వంటి బాధ్యతలను కలిగి ఉంటారు.

బిడ్ పత్రం ప్రకారం.. ఈ ప్రాజెక్టు లక్ష్యం ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్లు, అంతర్గత, బాహ్య విద్యుత్ వ్యవస్థలు, ప్లంబింగ్, శానిటరీ పనులు, అగ్నిమాపక సౌకర్యాలు, లిఫ్టులు, డీజిల్ జనరేటర్, హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (HVAC), భద్రతా వ్యవస్థలు, బాహ్య అభివృద్ధి, ల్యాండ్స్కేపింగ్తో కూడిన పూర్తి ఇంటిగ్రేటెడ్ న్యాయ నివాసాన్ని అభివృద్ధి చేయాలి. సింగిల్-పాయింట్ డిజైన్-బిల్డ్ ఎగ్జిక్యూషన్ మోడల్ ద్వారా వినియోగానికి సిద్ధంగా ఉన్న, అధిక నాణ్యత గల నివాస సౌకర్యాన్ని అందించడమే దీని ప్రధాన ఉద్దేశం.
ఈ ప్రాజెక్టుకు హడ్కో(HUDCO), రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇతర ఆమోదిత నిధుల వనరుల ద్వారా నిధులు సమకూర్చవచ్చని, ఎంపికైన కాంట్రాక్టర్ ఒప్పంద నిబంధనలకు, పర్యావరణ, సామాజిక భద్రతా చర్యలకు కచ్చితంగా అనుగుణంగా పనిని అమలు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. బిడ్డర్లు పర్యావరణ, సామాజిక నిర్వహణ ప్రణాళికలను సమర్పించాలి. భద్రత, ఆరోగ్యం, కార్మిక రక్షణ చర్యలను చేపట్టాలి. నిబంధనలను పాటించాలి. కాంట్రాక్టర్లు బిడ్డింగ్కు ముందు స్వతంత్రంగా సైట్ డ్యూ డిలిజెన్స్ చేపట్టాలి. కాంట్రాక్టును కేటాయించిన తర్వాత సైట్ పరిస్థితులపై తదుపరి క్లెయిమ్లను లేవనెత్తకూడదు. అందుకే ముందుగానే సైట్ను సందర్శించాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నమోదైన స్పెషల్ క్లాస్ సివిల్ కాంట్రాక్టర్లు మాత్రమే పాల్గొనడానికి అర్హులు. ఈ టెండర్ ప్రకారం రూ.14 లక్షల బిడ్ సెక్యూరిటీలో 1 శాతం చెల్లించాలి. విజేత బిడ్డర్, డీఎల్పీ(DLP) తర్వాత 60 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే 2.5 శాతం పనితీరు సెక్యూరిటీని సమర్పించాలి. తప్పుడు పత్రాలు, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించడం లేదా అసలు రికార్డులను అందించడంలో విఫలమైతే బ్లాక్లిస్టింగ్, సెక్యూరిటీ డిపాజిట్ల జప్తు, క్రిమినల్ ప్రాసిక్యూషన్కు దారితీయవచ్చు. యజమాని అనుమతిస్తే.. సబ్కాంట్రాక్టింగ్ ఒప్పంద విలువలో 50 శాతానికి మించకూడదు.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నమోదైన స్పెషల్ క్లాస్ సివిల్ కాంట్రాక్టర్లు మాత్రమే పాల్గొనడానికి అర్హులు. ఈ టెండర్ ప్రకారం రూ.14 లక్షల బిడ్ సెక్యూరిటీలో 1 శాతం చెల్లించాలి. విజేత బిడ్డర్, డీఎల్పీ(DLP) తర్వాత 60 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే 2.5 శాతం పనితీరు సెక్యూరిటీని సమర్పించాలి. తప్పుడు పత్రాలు, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించడం లేదా అసలు రికార్డులను అందించడంలో విఫలమైతే బ్లాక్లిస్టింగ్, సెక్యూరిటీ డిపాజిట్ల జప్తు, క్రిమినల్ ప్రాసిక్యూషన్కు దారితీయవచ్చు. యజమాని అనుమతిస్తే.. సబ్కాంట్రాక్టింగ్ ఒప్పంద విలువలో 50 శాతానికి మించకూడదు.
{{/usCountry}}ప్రీ బిడ్ సమావేశం 2026 జూలై 8న జరగనుండగా, బిడ్ల స్వీకరణ జూలై 20న ముగుస్తుంది. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇ-ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా సాంకేతిక, ఆర్థిక బిడ్లను ఆహ్వానిస్తారు.