భక్తులకు 45 నిమిషాలలోపు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం లభించేలా చూసేందుకు, శ్రీశైలం ఆలయ యంత్రాంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత దర్శన నిర్వహణ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. వరల్డ్ క్లాస్ క్యూ-లైన్ల సముదాయాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.

ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణ, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వ్యవస్థను పోలిన అత్యాధునిక క్యూ కాంప్లెక్స్. ఇది జనసమూహ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి, యాత్రా అనుభవాన్ని మెరుగుపరుస్తుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఈ సదుపాయంలో ఆధునిక సౌకర్యాలు, క్రమబద్ధమైన ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, అధునాతన నిఘా, వేయింటింగ్ హాళ్లు, యాత్రికుల కదలికలను నియంత్రించడానికి ఏఐ ఆధారిత పర్యవేక్షణ వంటివి ఉంటాయి.
రూ. 145 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ కాంప్లెక్స్ కోసం ప్రాథమిక సర్వే పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త వ్యవస్థ ఏకరూప ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ప్రవేశపెట్టి, అనధికార ప్రవేశాన్ని తొలగించి, పారదర్శకతను నిర్ధారిస్తుంది.
ఈ ప్రాజెక్టు 18 నెలల్లో పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఏఐ ఆధారిత దర్శన వ్యవస్థను అమలు చేస్తారు. క్యూలో చేరిన భక్తుడు 45 నిమిషాల్లో దర్శనం పూర్తి చేసుకుని బయటకు వెళ్తారు. ఈ మొత్తం వ్యవస్థ ప్రశాంతమైన, నిరాటంకమైన రాకపోకల కోసం ఉంటుంది.
ప్రస్తుతం భక్తులు క్యూలలో రెండు నుండి మూడు గంటల సమయం ఉండాల్సి వస్తుంది. సాధారణ రోజులలో గంటకు సుమారు 6,000 మంది భక్తులు, పండుగల సమయంలో దాదాపు 8,600 మంది భక్తులు దర్శనమిస్తారు. కొత్త విధానం ద్వారా, నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తూ, గంటకు 7,000 మంది భక్తుల నిరంతర ప్రవాహాన్ని కొనసాగించాలని అధికారులు ఆశిస్తున్నారు.
శని, ఆది, సోమవారాలు వంటి రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఉదయం 5:30 నుంచి 8:30 గంటల మధ్య కనీసం 20,000 మంది సాధారణ భక్తులకు దర్శనం కల్పించే లక్ష్యంతో, స్పర్శ దర్శనంలో మార్పులను కూడా చేస్తారు. ఏ భక్తుడూ క్యూలలో నిలిచిపోకూడదని ఈ వ్యవస్థను తీసుకొస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. సంతృప్తికరమైన దర్శన అనుభూతిని అందిస్తూనే, యాత్రికుల రాకపోకలు నిరంతరాయంగా సాగించేలా ఏర్పాట్లు చేస్తారు.
{{/usCountry}}శని, ఆది, సోమవారాలు వంటి రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఉదయం 5:30 నుంచి 8:30 గంటల మధ్య కనీసం 20,000 మంది సాధారణ భక్తులకు దర్శనం కల్పించే లక్ష్యంతో, స్పర్శ దర్శనంలో మార్పులను కూడా చేస్తారు. ఏ భక్తుడూ క్యూలలో నిలిచిపోకూడదని ఈ వ్యవస్థను తీసుకొస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. సంతృప్తికరమైన దర్శన అనుభూతిని అందిస్తూనే, యాత్రికుల రాకపోకలు నిరంతరాయంగా సాగించేలా ఏర్పాట్లు చేస్తారు.
{{/usCountry}}