విశాఖలో ఏఐ హబ్, డేటా సెంటర్.. గూగుల్తో ఎయిర్టెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం!
విశాఖపట్నంలో మెగా ఏఐ హబ్, డేటా సెంటర్ను స్థాపించనుంది గూగుల్. ఈ అతిపెద్ద ప్రాజెక్టులో ఎయిర్టెల్ కూడా వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ మేరకు కంపెనీ ప్రకటించింది.
భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ గూగుల్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్, డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. దీనితో దేశవ్యాప్తంగా ఏఐ వినియోగం వేగవంతం, భారతదేశానికి డిజిటల్ మౌలిక సదుపాయలను మరింత బలపరచడం లక్ష్యంగా ఉంది.

భారతదేశంలో మొట్టమొదటి మెగా ఏఐ హబ్, డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు అవుతుంది. దీనిలో గూగుల్తో ఎయిర్టెల్ కూడా భాగస్వామ్యం కలిగి ఉంది. విశాఖలో ఐదు సంవత్సరాలలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది గూగుల్.
ఇందులో భాగంగా భారతదేశంలో ఏఐ, డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేసేలా దేశవ్యాప్తంగా హై-స్పీడ్ ఫైబర్, సబ్సీ కనెక్టివిటీని నిర్మించనుంది ఎయిర్టెల్. ఈ ప్రాజెక్టు భారతదేశాన్ని ప్రపంచ ఏఐ మ్యాప్లో ఉంచుతుందని ఎయిర్టెల్ పేర్కొంది.
ఐదు ఏళ్ల కాలంలో సుమారు 15 బిలియన్ యూఎస్ డాలర్లను పెట్టుబడి పెట్టనుంది గూగుల్. గిగావాట్ స్థాయి డేటా సెంటర్ ఆపరేషన్లు, సబ్సీ నెట్వర్క్, క్లీన్ ఎనర్జీ లాంటి మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడంలో ఎయిర్టెల్ కూడా తనదైన పాత్ర పోషించనుంది. గూగుల్, ఎయిర్టెల్ సంయుక్తంగా రూపొందించే డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ విశాఖలో నిర్మాణం కానుంది. ఈ ప్రాజెక్టుతో వేగవంతమైన కనెక్టివిటీతోపాటు భారతదేశ డిజిటల్ వ్యవస్థ రూపురేఖలు మారిపోనున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో భారీ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను ఏర్పాటు చేసేందుకు గూగుల్, ఏపీ ప్రభుత్వం తాజాగా ఒప్పంద చేసుకున్న విషయం తెలిసిందే. ఇది అమెరికా వెలుపల దాని అతిపెద్ద ఏఐ హబ్. ఢిల్లీలో భారత్ ఏఐ శక్తి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో గూగుల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కీలక ఒప్పందం మీద సంతకాలు చేశాయి.
ఈ ప్రాజెక్టుతో వైజాగ్ ఏఐ సిటీగా మారనుంది. ఆసియాలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న పెద్ద ప్రాజెక్టు ఇది. 1,88,220 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. గూగుల్ క్లౌడ్ ఆధారిత కార్యక్రమాలతో ప్రతీ ఏటా.. రూ.9,553 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.47,720 కోట్ల ఉత్పాదకత జరుగుతుందంటున్నారు. 'ఇది అమెరికా వెలుపల మేం పెట్టుబడి పెట్టే అతిపెద్ద ఏఐ హబ్.' అని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


