శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. పెరిగిన భక్తుల రద్దీ, భారీగా ట్రాఫిక్ జామ్!

శ్రీశైలం దేవస్థానంలో వార్షిక మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాంప్రదాయ ఆగమ శాస్త్ర ఆచారాల ప్రకారం ప్రారంభమయ్యాయి. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతోంది.

Published on: Feb 9, 2026, 14:50:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫిబ్రవరి 8 నుండి 18వ తేదీ వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మహా శివరాత్రి ఫిబ్రవరి 15న వస్తుంది. ఆ రోజు ప్రభుత్సవం, పాగా అలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం జరగనుంది. ఫిబ్రవరి 16వ తేదీన మల్లిఖార్జునస్వామి, అమ్మవారి రథోత్సవం ఉంటుంది. 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

శ్రీశైలం
శ్రీశైలం

మరోవైపు శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానాన్ని కలిపే ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్‌లు కొనసాగుతున్నాయి. ఆదివారం నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనందున, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి కార్లలో తరలివచ్చారు. దీని ఫలితంగా శ్రీ సాక్షి గణపతి ఆలయం నుండి శ్రీశైలం ఆలయం వరకు ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయానికి కార్లు పెద్ద సంఖ్యలో రావడంతో ట్రాఫిక్‌ను నియంత్రించడంలో పోలీసులు చాలా ఇబ్బంది పడ్డారు. శివరాత్రి పండుగ నాటికి భక్తుల శాతం అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. భక్తులకు అనవసరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఘాట్ రోడ్డులో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ సందర్భంగా శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

బహిరంగ ప్రదేశాలలో పైప్ పండళ్లు, తగినంత లైటింగ్ ఏర్పాటు చేశారు. క్యూ లైన్ల నిర్వహణ, టాయిలెట్లను మరమ్మతు చేయడం, పాతాళగంగ స్నానపు ప్రదేశాలలో భద్రతా చర్యలు మెరుగుపరిచారు. అదనపు పార్కింగ్ ప్రాంతాలు, స్పష్టమైన సూచిక బోర్డులు, లగేజీ రూమ్‌లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. భక్తుల సౌలభ్యం కోసం 20 అదనపు లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేశారు.

మరోవైపు శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి అటవీ మార్గంలో వచ్చే భక్తులకు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. నిజానికి 8వ తేదీ నుంచి అనుమతి ఇవ్వాలని మెుదట అనుకున్నారు. కానీ ఫిబ్రవరి 6 నుంచి 15వ తేదీ వరకు పాదయాత్రగా వచ్చేందుకు భక్తులకు అనుమతి ఇచ్చారు. భక్తుల ఇబ్బందులను గమనించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో చాలా మంది భక్తులు శ్రీశైలానికి అటవీ మార్గంలో బయలుదేరారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More