అమరావతి రాజధాని పరిధిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. పచ్చదనం, విశాల ప్రాంగణాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ అహ్మద్, అతిధిలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, గౌరవ హైకోర్టు న్యాయాధిపతులు, రాజధానికి భూములిచ్చిన రైతులు హాజరుకానున్నారు.
పరేడ్ రిహార్సల్…

శనివారం ఉదయం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ ఫుల్ డ్రెస్ రిహార్సల్ ను ఘనంగా నిర్వహించారు. పరేడ్ రిహార్సల్ కు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జే. శ్యామలరావు హాజరై పరేడ్ ను పరిశీలించారు.
జంగారెడ్డి గూడెం ఏఎస్పీ పరేడ్ కమాండర్ ఆర్. సుస్మిత నుంచి డీజీపీ గౌరవ వందనం స్వీకరించి…. జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. వివిధ కంటింజెంట్స్ పరేడ్ లో పుల్ డ్రెస్ రిహార్సల్స్ కవాతు ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివిధ శాఖలకు చెందిన 22 శకటాలను ప్రదర్శించారు.
వీటిలో వందేమాతరం కు 150 వసంతాలు ఇతివృత్తంగా సాంస్కృతిక శాఖ, పది సూత్రాల మిషన్ కింద పేదరికం లేని సమాజం (Zero Poverty) ఇతివృత్తంతో ప్రణాళికా శాఖ శకటాలను రూపొందించాయి. పరేడ్ పుల్ డ్రెస్ రిహార్సల్స్ లో గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, పోలీస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ప్రత్యేక ఆహ్వానాలు…
అమరావతిలో నిర్వహించబోయే గణతంత్ర వేడుకల కోసం 15 ఎకరాల్లో వీవీఐపీ, వీఐపీ పార్కింగ్, 25 ఎకరాల్లో పబ్లిక్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం, రైతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీను ఏర్పాటు చేశారు. అమరావతి భూములు ఇచ్చిన రైతుల కోసం వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేయడం విశేషం. రైతులు వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ అధికారులు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు పంపిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రైతులు, ప్రజలు హాజరయ్యేలా సమన్వయం చేస్తున్నారు.
{{/usCountry}}అమరావతిలో నిర్వహించబోయే గణతంత్ర వేడుకల కోసం 15 ఎకరాల్లో వీవీఐపీ, వీఐపీ పార్కింగ్, 25 ఎకరాల్లో పబ్లిక్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం, రైతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీను ఏర్పాటు చేశారు. అమరావతి భూములు ఇచ్చిన రైతుల కోసం వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేయడం విశేషం. రైతులు వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ అధికారులు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు పంపిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రైతులు, ప్రజలు హాజరయ్యేలా సమన్వయం చేస్తున్నారు.
{{/usCountry}}