...
...
Next Story

యూఎస్‌లో 23 ఏళ్ల తెలుగు విద్యార్థిని మృతి.. రెండు రోజులుగా తీవ్రమైన జలుబు!

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆంధ్రాకు చెందిన ఓ విద్యార్థిని మృతి చెందింది. ఆమె చనిపోవడానికి రెండు మూడు రోజుల ముందు నుంచి ఛాతీ నొప్పి, జలుబు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Published on: Nov 10, 2025, 21:26:50 IST
Advertisement

ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్న 23 ఏళ్ల తెలుగు విద్యార్థి తీవ్రమైన దగ్గు, ఛాతీ నొప్పితో అమెరికాలో మరణించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యలక్ష్మి యార్లగడ్డ అలియాస్ రాజీ, ఇటీవల టెక్సాస్ A&M యూనివర్సిటీ కార్పస్ క్రిస్టి నుండి పట్టభద్రురాలైంది. బాపట్ల జిల్లాలోని కారంచేడు గ్రామంలో చిన్న రైతు కుటుంబంలో రాజీ జన్మించింది. ఎన్నో ఆశలతో ఆమె అమెరికాకు వెళ్లింది.

యూఎస్‌లో తెలుగు విద్యార్థిని మృతి
యూఎస్‌లో తెలుగు విద్యార్థిని మృతి

ఆమె కుటుంబ సభ్యుల చెప్పిన వివరాల ప్రకారం, రాజీ చనిపోయే ముందు రెండు రోజులుగా తీవ్రమైన జలుబు, ఛాతీ నొప్పితో బాధపడిందని తెలిసింది. నవంబర్ 7 ఉదయం అలారం మోగినప్పుడు రాజీ మేల్కొనలేదని ఆమె బంధువు చైతన్య వైవీకే తెలిపారు. 'వ్యవసాయంపై ఆధారపడిన తన కుటుంబానికి మెరుగైన భవిష్యత్తును నిర్మించాలనే ఆశతో ఆమె అమెరికాకు వచ్చింది. తన వృత్తిపరమైన జీవితాన్ని ప్రారంభించడానికి ఉద్యోగం కోసం వెతుకుతోంది.' అని చైతన్య చెప్పారు.

రాజీ మరణానికి కారణాన్ని తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. రాజీ విద్యా రుణాలు, అంత్యక్రియలు, ఆమె భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి అయ్యే ఖర్చులు, కుటుంబానికి ఆర్థిక సహాయం కోసం చైతన్య GoFundMe ద్వారా ఫండ్ సేకరిస్తున్నారు. ఇప్పటికే 1,25,185 యూఎస్ డాలర్లు సేకరించారు.

'ఈ క్లిష్ట సమయంలో ఏదైనా సహకారం, పెద్దది లేదా చిన్నది.. వారి జీవితాల్లో అర్థవంతమైన మార్పును కలిగిస్తుంది. కుటుంబానికి ఓదార్పునిస్తుంది.' అని గోఫండ్ పేజీలో రాశారు.

రాజీ తన కుటుంబంలో చిన్న కూతురు. ఆమె కుటుంబం గ్రామంలో వ్యవసాయ భూమిని కలిగి ఉంది. తల్లిదండ్రులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 'రాజీ తల్లిదండ్రులు వ్యవసాయాన్ని కొనసాగించడంలో సహాయం చేయాలని కలలు కన్నది. భవిష్యత్తు కోసం ఆశతో అమెరికా వచ్చింది. తల్లిదండ్రులకు మంచి జీవితాన్ని చూపించాలని అనుకుంది.' అని ఆమె బంధువు చైతన్య అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe