...
...
Next Story

AP Weather : నిప్పుల కొలిమిలా భానుడు - 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, అక్కడక్కడ పిడుగులతో వర్షాలు..!

Andhrapradesh Weather Updates : రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాలులు ముదురుతున్నాయి. నేడు 28 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ కాగా, రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది.

Published on: May 18, 2026, 08:28:28 IST
Advertisement

Andhrapradesh Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మే నెల మధ్యకు చేరుకోవడంతో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుతోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

తీవ్ర వడగాలుల ముప్పు…

ఏపీలో ఎండల తీవ్రత
ఏపీలో ఎండల తీవ్రత

రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం ప్రమాదకరంగా మారుతోంది. ఈ రోజు రాష్ట్రంలోని మొత్తం 28 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

  • శ్రీకాకుళం జిల్లా : ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, కంచిలి, నందిగం, పాతపట్నం, సోంపేట మండలాలు.
  • విజయనగరం జిల్లా : బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గంట్యాడ, మెరకముడిదాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు.
  • పార్వతీపురం మన్యం జిల్లా : బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పాచిపెంట, పాలకొండ, సాలూరు, సీతంపేట, వీరఘట్టం మండలాలు తీవ్ర వడగాలుల బారిన పడే అవకాశం ఉంది.
  • ఈ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 21 మండలాల్లో కూడా వడగాలుల ప్రభావం బలంగా చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు…

ఆదివారం నాటి వాతావరణ వివరాలను పరిశీలిస్తే….. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలోని కంభంలో అత్యధికంగా 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం నాటికి ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారనుంది. మంగళవారం నాడు ఎండ తీవ్రత పీక్ స్టేజ్‌కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 245 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe