ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. మొత్తం 34 కీలక అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన క్యాబినెట్, రాష్ట్ర అభివృద్ధి, పాలనా సంస్కరణలకు బాటలు వేసే పలు బిల్లులు, పాలసీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించింది. అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ ప్రాజెక్టుకు రూ.1,002.49 కోట్లు కేటాయించేందుకు క్యాబినెట్ సమ్మతించింది. ఈ నిర్మాణ బాధ్యతలను ప్రముఖ సంస్థ ఎల్అండ్టీకి అప్పగించాలని నిర్ణయించారు.
అసెంబ్లీ, హైకోర్టు భవనాల నూతన డిజైన్ల కోసం అదనపు నిధుల కేటాయింపునకు ఆమోదం లభించింది. అమరావతి ఐ ప్రాజెక్టుకు సంబంధించి కొత్తగా రీ-టెండర్లు పిలవాలని ఆదేశించింది. అమరావతి ప్రాంతంలో భూముల కేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులకు మంత్రివర్గం సమ్మతి తెలిపింది.
అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన దిశ బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ (భూ ఆక్రమణల నిరోధక) బిల్లు-2024లను ఉపసంహరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజలకు మరింత మేలు చేకూర్చేలా, భూ ఆక్రమణలు, మహిళల రక్షణపై మరింత పటిష్ఠమైన నూతన చట్టాలను రూపొందించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026తో పాటు ఏపీ పీపీపీ పాలసీ-2026 ముసాయిదాలకు ఆమోదం తెలిపారు. పాదచారుల ప్రాణ రక్షణ కోసం ప్రత్యేకంగా పాదచారుల భద్రత పాలసీ-2026 అమలుకు ఆమోదముద్ర వేశారు.
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలకు అనుగుణంగా విద్యా పరిపాలనను వేగవంతం చేసేందుకు 15 కొత్త డీఈవో పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. రాష్ట్రంలో ఉన్నత విద్యను మరింత విస్తరించేందుకు మరో రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతినిచ్చారు.
{{/usCountry}}రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలకు అనుగుణంగా విద్యా పరిపాలనను వేగవంతం చేసేందుకు 15 కొత్త డీఈవో పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. రాష్ట్రంలో ఉన్నత విద్యను మరింత విస్తరించేందుకు మరో రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతినిచ్చారు.
{{/usCountry}}దీనితో పాటు మున్సిపాలిటీలకు చెందిన భూముల లీజు గడువును పెంచేందుకు చట్టసవరణలు చేయడం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.