ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. పలు చోట్ల 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తుండటంతో ప్రజల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఆదివారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంధన సరఫరా, నిల్వలు, పంపిణీ తీరుపై కీలక సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఇంధన సరఫరా గతంతో పోలిస్తే 10 శాతం పెరిగిందని…. అయితే 'ప్యానిక్ బయింగ్' (ఆందోళనతో ముందస్తుగా కొనుగోలు చేయడం) కారణంగానే బంకుల్లో కొరత ఏర్పడుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సాధారణ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 6,330 కిలో లీటర్ల పెట్రోల్, 9,048 కిలో లీటర్ల డీజిల్ అమ్ముడవుతాయి. కానీ, కొరత రాబోతుందన్న ప్రచారంతో వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తారు. దీంతో శనివారం ఒక్కరోజే ఏకంగా 10,345 కిలో లీటర్ల పెట్రోల్, 14,156 కిలో లీటర్ల డీజిల్ విక్రయాలు జరిగాయి. అంటే సాధారణ అమ్మకాల కంటే డిమాండ్ 50 శాతం మేర పెరగడంతో బంకుల్లో ఉన్న నిల్వలు వేగంగా నిండుకుంటున్నాయి.
సీఎం కీలక ఆదేశాలు…..
పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నిల్వలపై తప్పుడు ప్రచారాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సరఫరా గొలుసులో ఎక్కడా ఆటంకాలు లేకుండా చూడాలని, కంపెనీల నుంచి డిపోలకు, అక్కడి నుంచి బంకులకు ఇంధనం చేరే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. "సాధారణ అవసరాల కంటే ఎక్కువ స్థాయిలో విక్రయాలు జరుగుతుండటంతోనే ఈ సమస్య వస్తోంది. దీనిపై పౌర సరఫరాల శాఖ, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలి," అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలు తీసుకున్న తక్షణ చర్యలు, సమస్య పరిష్కారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
ప్రజలు అనవసర ఆందోళనకు గురై పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అవసరానికి మించి నిల్వ చేసుకోవడం వల్లే నిజంగా అత్యవసరమైన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్ కుమార్ ప్రసాద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సరఫరాను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
{{/usCountry}}ప్రజలు అనవసర ఆందోళనకు గురై పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అవసరానికి మించి నిల్వ చేసుకోవడం వల్లే నిజంగా అత్యవసరమైన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్ కుమార్ ప్రసాద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సరఫరాను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
{{/usCountry}}