రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి - సీఎం చంద్రబాబు

వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఖరీఫ్ సాగు, రబీ ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో గ్రాస్ వాల్యూ అడిషన్ పై దిశా నిర్దేశం చేశారు. 

Published on: Oct 09, 2025 4:53 PM IST
By , Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. రైతు సేవా కేంద్రాలను రీ-ఓరియంటేషన్ చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులకు సేవలందించేలా రైతు సేవా కేంద్రాలను తీర్చిదిద్దాలన్నారు.

సీఎం చంద్రబాబు సమీక్ష
సీఎం చంద్రబాబు సమీక్ష

సేంద్రీయంపై అవగాహన పెంచాలి - సీఎం చంద్రబాబు

రైతులకు వివిధ రకాల ప్రభుత్వ సేవలు అందించే విషయంలో ఆర్ఎస్కేలే కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మంచి పోషక విలువలు అందించటం ద్వారా భూసారం పెంచాలని… దాని ద్వారా ఉత్పాదకత పెంచాలన్నారు.

2026 ఖరీఫ్ సీజన్లో సేంద్రీయ సాగు చేసేలా, రసాయన ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణంతో పాటు ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా జరిగే ప్రయోజనాలు రైతులకు వివరించాలని పేర్కొన్నారు. ఎలాంటి మార్పులు జరగాలన్నా... క్షేత్రస్థాయిలో ఉండేవారికి పూర్తి స్థాయి అవగాహన ఉండేలా చూడాలన్నారు. భూసారం పెంచే పోషకాల విషయంలో లోపాలను సవరించి తదుపరి ప్రణాళికలు చేసుకోవాలని వివరించారు.