పేదలకు శుభవార్త - ఇవాళ ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్లలో లబ్దిదారుల గృహ ప్రవేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందిస్తారు.
ఏపీలో ఇవాళ కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. ఒకేసారి 3 లక్షల మంది పేదలు… గృహ ప్రవేశాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 3 లక్షల ఇళ్లలో లబ్దిదారుల గృహ ప్రవేశాలు జరుగనున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.
గృహ ప్రవేశాలు (ఫైల్ ఫొటో)
రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. లబ్దిదారులకు ఇంటి తాళాలు అందించనున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-బీఎల్సీ కింద నిర్మించిన 2,28,034 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు, పీఎంఏవై జన్మన్ పథకం కింద మరో 6,866 ఇళ్లలో లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేయనున్నారు.
మొత్తంగా 3,00,192 ఇళ్లకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం ద్వారా దాదాపు ఉచిత ఇసుక విధానంతో దాదాపు 20 టన్నుల ఇసుక ఉచితంగా పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.
గతంలో నిలిపేసిన ఇళ్ల నిర్మాణాలకు చెందిన బకాయి బిల్లులను దశల వారీగా కూటమి ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం పూర్తి చేసిన ఈ ఇళ్లనే కాకుండా.. మరిన్ని ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 3 లక్షల ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయా జిల్లాల నుంచి మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా ఈ సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొననున్నారు.
News/Andhra Pradesh/పేదలకు శుభవార్త - ఇవాళ ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు
News/Andhra Pradesh/పేదలకు శుభవార్త - ఇవాళ ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు