...
...
Next Story

AP Handicrafts Wood Banks : హస్తకళాకారులకు భరోసా - ఏపీలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ప్రారంభం! క్యూర్ కోడ్ తో సమాచారం

AP Handicrafts Wood Banks : ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధవళేశ్వరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ప్రారంభించారు. 5,000 కళాకారుల కుటుంబాలకు ఉపాధి లభించనుంది.

Published on: Aug 16, 2026, 11:26:57 IST
Advertisement

AP Handicrafts Wood Banks : ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలు, విశిష్ట వారసత్వ సంపదకు సజీవ రూపాలైన హస్తకళల పరిరక్షణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని హస్తకళాకారులను ఆదుకోవడానికి, వారికి ఎదురవుతున్న ముడిసరుకు కొరతను తీర్చడానికి ఏర్పాటు చేసిన 'క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను' రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.

ధవళేశ్వరంలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభం!
ధవళేశ్వరంలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభం!

రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని ధవళేశ్వరం వద్ద అటవీ శాఖ రూపుదిద్దిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ప్రారంభించారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆరు ప్రధాన క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఇతర క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టారు.

5 వేల మంది కళాకారులకు భరోసా…

ఈ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000 హస్తకళాకారుల కుటుంబాలకు ప్రధాన ముడిసరుకైన కలప దొరక్క పడుతున్న ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి కలగనుంది. ధవళేశ్వరంలోని రాజమహేంద్రవరం సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులో ప్రస్తుతం 30 క్యూబిక్ మీటర్ల నాణ్యమైన కలపను కళాకారుల అవసరాల కోసం అందుబాటులో ఉంచారు.

రాబోయే ఐదేళ్లకు సరిపడా కలప నిల్వలను త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని అటవీ శాఖ అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రపంచప్రసిద్ధి గాంచిన ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, మాధవమాల ఉత్పత్తులు, శెట్టిగుంట కళాకృతులు, బొబ్బిలి వీణల తయారీదారుల కోసం ఆయా ప్రాంతాల్లోనే ప్రత్యేకంగా ఈ వుడ్ బ్యాంకులను నెలకొల్పడం విశేషం.

ప్రతి బొమ్మపై క్యూఆర్ కోడ్…..

అంతేకాకుండా…. వుడ్ బ్యాంకులో నిల్వ ఉంచిన కలప దుంగలపై ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను కూడా స్కాన్ చేశారు. ఆ దుంగను ఏ అటవీ ప్రాంతం నుంచి సేకరించారు, ఆ చెట్టు వయస్సు ఎంత..? దాని శాస్త్రీయ నామం ఏమిటి వంటి ఆసక్తికర వివరాలను అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రదర్శనలో ఉంచిన పలు హస్తకళాకృతులు నచ్చడంతో సతీమణి అన్నా కొణిదెలతో కలసి ఉప ముఖ్యమంత్రి వాటిని కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe