AP EAPCET 2026 Counselling Web Options : రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2026) కౌన్సెలింగ్ ప్రక్రియ కొసాగుతోంది. ఇప్పటికే అర్హత సాధించిన విద్యార్థుల నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తుండగా… వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్ నమోదుతో పాటు కాలేజీ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
జులై 31 వరకు వెబ్ ఆప్షన్లు…
- ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అభ్యర్థులు ముందుగా https://cap.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- జులై 29వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులు, అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల ఆన్లైన్ పరిశీలన జులై 31వ తేదీతో ముగుస్తుంది.
- ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు జులై 31వ తేదీ వరకు తమకు ప్రాధాన్యత ఉన్న కాలేజీలు, నచ్చిన కోర్సులను ఎంచుకుంటూ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.
- విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇస్తే మంచి కాలేజీలో సీటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఒకవేళ ఆప్షన్లు నమోదు చేసిన తర్వాత ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే… అందుకు ఆగస్టు 1వ తేదీన ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు.
ఆగస్టు 6న సీట్ల కేటాయింపు, 10 నుంచి తరగతులు

విద్యార్థులు ఎంచుకున్న వెబ్ ఆప్షన్ల ఆధారంగా, వారి ఈఏపీసెట్ ర్యాంక్ మెరిట్ మరియు రిజర్వేషన్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 6వ తేదీన మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు. అలాట్ మెంట్ ఫలితాలను కూడా https://cap.apcfss.in/ వెబ్ సైట్ లో చూడొచ్చు. సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 7వ తేదీ నుండి ఆగస్టు 13వ తేదీ లోపు తమకు కేటాయించిన కళాశాలల్లో స్వయంగా హాజరై సెల్ఫ్ జాయినింగ్, రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
నిర్ణీత గడువులోగా కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయని విద్యార్థుల సీటును ఆటోమేటిక్గా రద్దు చేస్తారు. కాబట్టి ప్రవేశం పొందాలనుకునే వారు తప్పనిసరిగా కేటాయించిన సమయంలోనే రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇక 2026-27 నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంజినీరింగ్ తరగతులు ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.