...
...
Next Story

AP EAPCET 2026 Counseling : ఏపీ ఈఏపీసెట్ సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల - అలాట్‌మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP EAPCET Seat Allotment 2026 : ఏపీ ఈఏపీసెట్ - 2026 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. అభ్యర్థులు తమ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆగస్టు 15లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Published on: Aug 10, 2026, 06:30:55 IST
Advertisement

AP EAPCET Seat Allotment 2026 : ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ (AP EAPCET) ఇంజినీరింగ్ సంబంధిత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు విద్యాశాఖ సీట్లను కేటాయించింది. కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసిన అభ్యర్థులు తమకు ఏ కళాశాలలో, ఏ బ్రాంచ్‌లో సీటు వచ్చిందో తెలుసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ https://cap.apcfss.in/ నుంచి అలాట్‌మెంట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

ఏపీ ఈఏపీసెట్ సీట్ల కేటాయింపు
ఏపీ ఈఏపీసెట్ సీట్ల కేటాయింపు

ఈ ఏడాది నిర్వహించిన ఈఏపీసెట్ పరీక్షలో మొత్తం 1,74,802 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి అర్హత పొందారు. వీరిలో ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం 1,13,488 మంది విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి పత్రాలను పరిశీలించిన అనంతరం…. 1,12,285 మందిని అర్హులుగా గుర్తించారు. అర్హత సాధించిన విద్యార్థులంతా తమకు ఇష్టమైన కళాశాలలు, కోరుకున్న కోర్సుల ఆధారంగా వెబ్ ఐచ్ఛికాలను (వెబ్ ఆప్షన్లు) నమోదు చేసుకున్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అలాగే ఇంజినీరింగ్ కళాశాలలు మొత్తం కలిపి 239 వరకు ఉన్నాయి. ఈ అన్ని సంస్థల్లో కలిపి కన్వీనర్ కోటా కింద మొత్తం 1,51,312 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి 1,07,239 సీట్లు కేటాయించారు. దీని ప్రకారం ఇంకా 44,073 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. వీటిని తదుపరి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు.

ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉన్న 14,567 సీట్లలో ఏకంగా 92 శాతం సీట్లు మొదటి విడతలోనే నిండిపోయాయి. ఇక ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మరియు అనుబంధ కళాశాలల్లో మొత్తం 9,347 సీట్లు అందుబాటులో ఉండగా, వీటిలో 87 శాతం సీట్లను విద్యార్థులు దక్కించుకున్నారు.

రిపోర్టింగ్ తేదీలు…

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe