2026-27 విద్యా సంవత్సరానికి గాను బీఈడీ, బీఈడీ(స్పెషల్) కోర్సులలో ప్రవేశాల కోసం దరఖాస్తులను నడుస్తున్న విషయం తెలిసిందే. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులను సమర్పించడానికి మార్చి 27 చివరి తేదీ. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు, గడువు ముగిసేలోపు తమ దరఖాస్తులను పూర్తి చేయాలని అధికారులు కోరారు.

ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. ఇటీవలి అప్డేట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పరీక్షల షెడ్యూల్ను కూడా సవరించింది. వాస్తవానికి మే 4న జరగాల్సి ఉన్న ప్రవేశ పరీక్ష.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో 2026 మే 8న జరుగుతుంది.
పరీక్ష రెండు షిఫ్టులలో జరుగుతుంది. ఉదయం 9:00 నుండి 11:00 గంటల వరకు జరిగే సెషన్లో గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రాలు ఉంటాయి. మధ్యాహ్నం 2:00 నుండి 4:00 గంటల వరకు జరిగే సెషన్లో సాంఘిక శాస్త్రం, ఆంగ్ల పేపర్లు ఉంటాయి.
ఏపీ ఎడ్సెట్ 2026 ఎగ్జామ్ 150 మార్కులకు ఉంటుంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. ఫలితాల ప్రకటన తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారవుతుంది. విడతల వారీగా సీట్లను భర్తీ చేస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపులు ఉంటాయి.
అభ్యర్థులు సవరించిన షెడ్యూల్ను గమనించి, దానికి అనుగుణంగా తమ సన్నాహాలను ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఏపీ ఎడ్ సెట్ పరీక్ష ఆధారంగా 2026- 2027 విద్యా సంవత్సరానికి బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఏడాది పరీక్షను చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. లాంగ్వేజేస్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, సైన్స్ అభ్యర్థులు ఈ పరీక్ష రాయవచ్చు.
ప్రస్తుతం చివరి సంవత్సరం డిగ్రీ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ఎడ్ సెట్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఎస్సీ/ ఎస్టీలకు రూ.500; బీసీలకు రూ.600గా నిర్ణయించారు. ఓసీలకు రూ.700గా ఉంది. ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాలి.
ఎలా అప్లై చేయాలి
- అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/EDCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- నిర్ణయించిన అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- హోంపేజీలో కనిపించే స్టెప్ 3(ఫిల్ అప్లికేషన్) పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ పేమెంట్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే ఆన్ లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ విద్యా అర్హతలతో పాటు సంబంధిత పత్రాలను అప్ లోడ్ చేయాలి. ఫొటో, సంతకం కూడా అవసరం.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.
- హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉపయోగపడుంది.
ప్రస్తుతం చివరి సంవత్సరం డిగ్రీ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ఎడ్ సెట్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఎస్సీ/ ఎస్టీలకు రూ.500; బీసీలకు రూ.600గా నిర్ణయించారు. ఓసీలకు రూ.700గా ఉంది. ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాలి.
ఎలా అప్లై చేయాలి
- అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/EDCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- నిర్ణయించిన అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- హోంపేజీలో కనిపించే స్టెప్ 3(ఫిల్ అప్లికేషన్) పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ పేమెంట్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే ఆన్ లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ విద్యా అర్హతలతో పాటు సంబంధిత పత్రాలను అప్ లోడ్ చేయాలి. ఫొటో, సంతకం కూడా అవసరం.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.
- హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉపయోగపడుంది.