ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నియంత్రణపై కమిటీ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నియంత్రణపై ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కోచింగ్ సెంటర్లలో పాటించాల్సిన నిబంధనలను ఈ కమిటీ నిర్ణయిస్తుంది.
ఏపీలోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు పాటించాల్సిన నిబంధనల రూపకల్పనకు ఉన్నత విద్యాశాఖ కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో 13 మందితో కమిటీ ఏర్పాటు అయింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిటీలో జాతీయ మెంటల్ హెల్త్ టాస్క్ఫోర్స్ అధికారులు, సైకాలజిస్ట్, సైక్రియాటిస్ట్, ఎన్జీఓలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నత విద్యామండలి ఛైర్మన్, సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్, ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు.
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల నమోదు, వారి పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి వేదిక ఉండాలని అన్ని రాష్ట్రాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జూలైలో తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాలు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై నిబంధనలు రూపొందించాలని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని రక్షించేలా ఉండాలని వెల్లడించింది. రెండు నెలల్లోపు నియమాలను తెలియజేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంపై సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్, విద్యార్థులను రక్షించడానికి, ఫిర్యాదులను పరిష్కరించడానికి నియమాలను రూపొందించడానికి తాజాగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సుఖ్దేబ్ సాహా వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ & అదర్స్ కేసులో సుప్రీంకోర్టు జూలై 25, 2025న ఇచ్చిన తీర్పును అనుసరించి ఉన్నత విద్యా శాఖ GO 209 జారీ చేసింది.
కోచింగ్ సెంటర్లలో అభ్యర్థుల మానసిక ఆరోగ్య రక్షణలను అమలులోకి తెచ్చే సమగ్ర నిబంధనలను ఈ కమిటీ రూపొందిస్తుంది. పదిహేను రోజుల్లో కమిటీ సిఫారసులతో నివేదికను ప్రభుత్వానికి పంపనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


