...
...
Next Story

ఏపీలో ప్రెగ్నెన్సీ-ప్రెగ్నెన్సీకి మధ్య రెండేళ్ల గ్యాప్ ఇచ్చిన జంటలకు రూ.5000 క్యాష్ ప్రైజ్

గర్భధారణల మధ్య సరైన గ్యాప్ లేకపోవడంతో అనేక మంది తల్లులు, పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఈ సమస్యను అరికట్టేందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది.

Published on: Jul 7, 2026, 10:33:08 IST
Advertisement

ప్రసవాల మధ్య సరైన కాల వ్యవధి పాటించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, కుటుంబ నియంత్రణ సేవలను మరింత చేరువ చేసేందుకు జూలై 11 నుండి 18 వరకు రాష్ట్రవ్యాప్త అవగాహన వారోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ఒక ప్రకటనలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

ప్రెగ్నెన్సీకి గ్యాప్ ఇచ్చిన జంటలకు నగదు బహుమతి
ప్రెగ్నెన్సీకి గ్యాప్ ఇచ్చిన జంటలకు నగదు బహుమతి

వరుస గర్భధారణల మధ్య కనీసం రెండేళ్ల వ్యవధిని నిర్వహించడం వల్ల తల్లీ, పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఈ కనీస గ్యాప్ వల్ల మాతృ మరణాలను 30 శాతం వరకు, అలాగే శిశు మరణాలను 10 శాతం వరకు తగ్గించవచ్చని మంత్రి స్పష్టం చేశారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలనే ఉద్దేశంతోనే ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రచారంలో భాగంగా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నగదు బహుమతులను ప్రకటించింది. మూడు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న జంటలు ప్రతి జిల్లా నుండి ముగ్గురు దంపతులను ఎంపిక చేస్తారు. ఒక్కో జంటకు రూ. 5,000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తారు.

అంతేకాదు ప్రసవాల మధ్య రెండేళ్ల వ్యవధి పాటించిన జంటలను కూడా సెలక్ట్ చేస్తారు. ప్రతి జిల్లా నుండి మరో ముగ్గురు దంపతులను ఎంపిక చేసి, వారికి కూడా రూ. 5,000 చొప్పున నగదు బహుమతి ఇస్తారు. రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల నుండి జిల్లాకు ఆరుగురు చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఒకవేళ అర్హులైన దరఖాస్తుదారుల సంఖ్య కోటా కంటే ఎక్కువగా ఉంటే.. లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe