భారీ పెట్టుబడితో అనంతపురంలో అడుగుపెడుతున్న రేమండ్ గ్రూప్.. 5,500 ఉద్యోగాలు అంచనా!
అనంతపురం జిల్లాలో రేమండ్ గ్రూప్ రెండు గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు స్థాపించడానికి సిద్ధమైంది. ఏరోస్పేస్, ఆటోమోటివ్ సెక్టార్లలో ఈ ప్రాజెక్టులు రూ.940 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు అవుతాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేమండ్ గ్రూప్ ద్వారా రూ.940 కోట్ల విలువైన రెండు పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఇవి ఏరోస్పేస్, ఆటోమోటివ్ కాంపోనెంట్స్ తయారీకి సంబంధించినవని అధికారులు ప్రకటించారు. రేమండ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రెండు గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను స్థాపిస్తుంది.

ఈ అనుమతులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి విధానం 4.0 కింద వస్తాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 5,500 ప్రత్యక్ష ఉద్యోగాలను వస్తాయని భావిస్తున్నారు. 'ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 (2024-29) కింద రేమండ్ గ్రూప్ నుండి రెండు ల్యాండ్మార్క్ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.' అని ప్రభుత్వం తెలిపింది.
కొత్త ఏరోస్పేస్ పాలసీ కింద ఆంధ్రప్రదేశ్లో ఇది తొలి ఏరోస్పేస్ పెట్టుబడి అని, ప్రత్యేక ప్యాకేజీ ప్రాజెక్టు ప్రారంభాన్ని వేగవంతం చేస్తుందని ప్రకటన వెలువడింది. రేమండ్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన జెకె మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూ. 510 కోట్ల పెట్టుబడితో అధునాతన ఏరోస్పేస్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీనితో 1,400 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. గ్లోబల్ ఒరిజినల్ పరికరాల తయారీదారులు, టైర్-1 సరఫరాదారులకు ప్రెసిషన్ కాంపోనెంట్లను ఉత్పత్తి చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ ఏరోస్పేస్ సరఫరా గొలుసులో అనుసంధానిస్తుందని అంచనా. వాణిజ్య ఉత్పత్తి మే 2027 నాటికి ప్రారంభం కానుంది.
అదేవిధంగా, రేమండ్ అనుబంధ సంస్థ జెకె మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ లిమిటెడ్ గుడిపల్లిలో ఆటోమోటివ్ కాంపోనెంట్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తుంది, రూ. 430 కోట్లు పెట్టుబడి పెట్టి 4,096 ఉద్యోగాలను సృష్టిస్తుంది. మే 2027 నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని షెడ్యూల్ చేసిన ఈ ప్లాంట్.. భారతదేశం, విదేశాలలోని ప్రముఖ ఆటో కంపెనీలకు అవసరాలను తీరుస్తుంది. ప్రాంతీయ ఉపాధి, నైపుణ్య అభివృద్ధిని పెంచుతుంది.
ఈ ప్రాజెక్టులు అనంతపురంలో ఏర్పాటు చేయడంలో ఏపీ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు కీలక పాత్ర పోషించాయి. రేమండ్ గ్రూప్.. అనంతపురం నుంచి ప్రంపచానికి హైటెక్ భాగాలను పంపించనుంది. అనంతపురం ఏరోస్పేస్, ఆటోమోటివ్ హబ్గా తీర్చిదిద్దే శక్తివంతమైన అడుగుగా అనుకుంటున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


