...
...
Next Story

ఆంధ్రప్రదేశ్ పాఠశాల్లో 6,534 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు విధానం ఇలా!

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ మొత్తం 6,534 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్ ద్వారా ఉంటుంది.

Published on: Aug 15, 2026, 09:09:48 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ అభ్యర్థులకు తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలను భర్తీ చేసేందుకు పాఠశాల విద్య డైరెక్టరేట్ శ్రీకారం చుట్టింది.

ఏపీ స్కూళ్లలో ఉద్యోగాలు
ఏపీ స్కూళ్లలో ఉద్యోగాలు

మొత్తంగా 6,534 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ (విద్యా వాలంటీర్) పోస్టుల నియామకం చేపడుతున్నట్లు అధికారుల ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన చేపడుతున్నారు. మొత్తం 6,534 ఖాళీలను రెండు ప్రధాన కేటగిరీలుగా విభజించారు. స్కూల్ అసిస్టెంట్ 2,937, సెకండరీ గ్రేడ్ టీచర్ 3,597 ఖాళీలు ఉన్నాయి.

ఈ నియామకం కేవలం 8 నెలల కాలానికి మాత్రమే పరిమితం. 2026 సెప్టెంబర్ 01 నుండి 2027 ఏప్రిల్ 30 వరకు అభ్యర్థులు విధుల్లో కొనసాగుతారు. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం అభ్యర్థుల అర్హతలు, మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ చేస్తారు. TET (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) లేదా DSC అర్హత పొందిన అభ్యర్థులకు ఈ నియామకాల్లో ప్రాధాన్యత లభిస్తుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తమ పరిధిలోని మండల విద్యాధికారి కార్యాలయంలో (MEO) నిర్ణీత గడువులోగా దరఖాస్తు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు చూసుకుంటే.. అకడమిక్ విద్యార్హతల సర్టిఫికెట్లు (పదో తరగతి, ఇంటర్, డిగ్రీ/పిజి), ప్రొఫెషనల్ అర్హత పత్రాలు (D.Ed / B.Ed మార్కుల మేమోలు), AP TET / DSC స్కోర్ కార్డ్ ప్రతులు, స్థానికతను తెలియజేసే కుల, నివాస ధృవీకరణ పత్రాలు కావాలి.

అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ వరకు మండల విద్యాధికారి కార్యాలయాన్ని సంప్రదించి అప్లై చేయాలి. ఎంపికైనవారు సెప్టెంబర్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూళ్లలో విద్యను బోధిస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe