AP Inter Results 2026 : ఇవాళ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల - మీ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?
AP Inter Results 2026 : ఏపీ ఇంటర్ ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 10.31 నిమిషాలకు ఫలితాలు విడుదలవుతాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు.
AP Inter Results 2026 :ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇవాళ ఉదయం 10.31 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు సిద్ధం చేసింది.

ఏపీ ఇంటర్ ఫలితాల విడుదలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇవాళ ఉదయం 10.31 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను వెల్లడిస్తారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు మార్చి 23 వరకు కొనసాగాయి. ఫస్ట్ ఇయర్ లో కొత్తగా అమల్లోకి తెచ్చిన కొన్ని విధానాల వల్ల పరీక్షల నిర్వహణకు దాదాపు నెల రోజుల సమయం పట్టినప్పటికీ…. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మే నెలకు ముందే ఫలితాలను ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమైంది. నిర్దేశించుకున్న సమయంలోపే స్పాట్ వాల్యుయేషన్ పూర్తి కావటంతో… బుధవారం ఫలితాలను ప్రకటించనున్నారు.
ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఇంటర్ పరీక్షలకు మొత్తం సుమారు 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5.31 లక్షలు, రెండో సంవత్సరం విద్యార్థులు 5.26 లక్షల మంది ఉన్నారు. ఫలితాల వెల్లడి అనంతరం రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన వివరాలను కూడా ఇంటర్ బోర్డు ప్రకటించనుంది.
ఏపీ ఇంటర్ ఫలితాలను ఎక్కడ చూసుకోవాలి?
విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సాయంతో https://resultsbie.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా సులభంగా ఫలితాలను తెలుసుకోవచ్చు,
- మనమిత్ర వాట్సప్లో 95523 00009 నంబర్కు ‘Hi’ అని మెసేజ్ సెండ్ చేయాలి.
- రిప్లైలో వచ్చే ఆప్షన్లలో ‘Select Service’ ఎంచుకోవాలి.
- తర్వాత ‘Education Services’ ఆప్షన్ క్లిక్ చేయండి.
- ఇంటర్ పరీక్షల ఫలితాలను డౌన్లోడ్ చేసుకోండి అని కనబడుతుంది.
- ఫలితాల డౌన్లోడ్ ఆప్షన్ యాక్టివ్ అయిన తర్వాత మీ హాల్టికెట్ నెంబర్ నమోదు చేయాలి.
- మీ వాట్సప్ నెంబర్కు వచ్చే ఫలితాలు / మార్కుల షార్ట్ మెమో పీడీఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

