ఏపీ మద్యం కుంభకోణంలో నిందితులకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కుంభకోణం వైసీపీ పాలనలో జరిగింది. సిట్ ముందుకు సాగుతున్న కొద్దీ, ప్రతి అడుగుతో కొత్త లింకులు బయటపడుతున్నాయి. లిక్కర్ స్కామ్లో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది.

అంతకుముందు దర్యాప్తులో భాగంగా అధికారులు A1 రాజ్ కాసిరెడ్డి ఆస్తులను జప్తు చేశారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి ఆస్తులను కూడా అధికారులు జప్తు చేస్తారు. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మీ ఆస్తులను కూడా జప్తు చేయాలని నిర్ణయించారు. ఓ వైపు వైసీపీ దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది.
2025 సెప్టెంబర్లో చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్లోని భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలు, కంపెనీలపై సిట్ దాడులు నిర్వహించింది. ఆ తర్వాత ఆ బృందం హైదరాబాద్లోని షాబాద్లో రూ.150 కోట్ల విలువైన 90 ఎకరాలు, గచ్చిబౌలిలో రూ.15 కోట్ల విలువైన 326 చదరపు గజాలను స్వాధీనం చేసుకునేందుకు ఒక ప్రతిపాదనను రూపొందించింది. మోహిత్ రెడ్డి కంపెనీలతో ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్న షెల్ కంపెనీ వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బేవరేజెస్తో సంబంధాలను కూడా సిట్ గుర్తించింది.
షెల్ ఆపరేషన్ల ద్వారా మనీలాండరింగ్ జరిగినట్లు అధికారులు ఆధారాలను కనుగొన్నారు. 2024లో అధికారులు చెక్పోస్ట్లో రూ.8 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి చెవిరెడ్డితో కూడా సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం ఇప్పుడు చెవిరెడ్డి కుటుంబానికి చెందిన ఆస్తులను అటాచ్ చేస్తోంది.
మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి కుటుంబం రూ.63.72 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని దర్యాప్తులో తేలింది. అయితే ఇందులో 8 కోట్లకుపైగా తగ్గించారని సిట్ గుర్తించింది. మిగిలిన 54 కోట్లకుపైగా ఆస్తిని బ్లాక్ మనీగా మలిచారని అధికారులు తెలుసుకున్నారు. ఎక్కువ మెుత్తాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టాని అంటున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్, తొట్టంబేడు జాయింట్ రిజిస్ట్రార్ల వద్ద రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా బయటపడింది. మోసపూరిత భూ లావాదేవీలు భారీగా చేసినట్టుగా సిట్ గుర్తించింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ఆస్తులు అటాచ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
{{/usCountry}}మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి కుటుంబం రూ.63.72 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని దర్యాప్తులో తేలింది. అయితే ఇందులో 8 కోట్లకుపైగా తగ్గించారని సిట్ గుర్తించింది. మిగిలిన 54 కోట్లకుపైగా ఆస్తిని బ్లాక్ మనీగా మలిచారని అధికారులు తెలుసుకున్నారు. ఎక్కువ మెుత్తాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టాని అంటున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్, తొట్టంబేడు జాయింట్ రిజిస్ట్రార్ల వద్ద రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా బయటపడింది. మోసపూరిత భూ లావాదేవీలు భారీగా చేసినట్టుగా సిట్ గుర్తించింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ఆస్తులు అటాచ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
{{/usCountry}}