ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులను విద్యాశాఖ ఖరారు చేసింది. సుమారు 48 రోజులు విద్యార్థులకు హాలీడేస్ ఉంటాయి. ఏప్రిల్ 23వ తేదీ స్కూళ్లకు చివరి వర్కింగ్ డే. ఇక వేసవి సెలవుల్లో విద్యార్థులు బయట తిరగడం, ఎండలో ఇబ్బందిపడటంలాంటివి జరుగుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

వేసవి సెలవులు నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ ఇచ్చింది. వడ దెబ్బ, వడగాలుల ప్రభావం, నదులు, చెరువులు, కాలువల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అన్ని స్కూళ్లల్లో ఈ కౌన్సిలింగ్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా, విద్యార్థులు మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, తగినంత నీరు తాగాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని విద్యాశాఖ చెప్పింది. వడదెబ్బ నివారణపై ఆరోగ్య అవగాహన కార్యక్రమాలలో పాల్గొనాలని మార్గదర్శకాలు ఇచ్చింది..
కాలువలు, చెరువులు, నదులు వంటి జలాశయాల సమీపంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని విద్యాశాఖ నొక్కి చెప్పింది. పెద్దల పర్యవేక్షణ లేకుండా ఈ ప్రదేశాలను సందర్శించవద్దని, అలాగే తెలియని నీటు కుంటలు, చెరువుల్లో ఈత కొట్టవద్దని విద్యార్థులకు సూచించారు అధికారులు. అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు స్వయంగా రక్షించుకోవడానికి ప్రయత్నించకుండా, పెద్దలను అప్రమత్తం చేయాలి.
అదేవిధంగా పాఠశాలలు కౌన్సెలింగ్లో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని, క్రీడలు, పఠనం వంటి కార్యకలాపాలను ప్రోత్సహించాలని విద్యాశాఖ తెలిపింది. అలాగే ఫోన్, టీవీల స్క్రీన్ చూసే సమయాన్ని తగ్గించాలని సూచనలు చేసింది. భద్రతా సూచనలను నోటీసు బోర్డులపై ప్రదర్శించాలి, జలాశయాల సమీపంలో ఉన్న పాఠశాలలు మరింత అప్రమత్తతతో ఉండాలని తెలిపింది.
జిల్లా, మండల విద్యాధికారుల ద్వారా పర్యవేక్షణను ముమ్మరం చేయడంతో పాటు సెలవులు ప్రారంభమయ్యేలోపు విద్యార్థుల కౌన్సెలింగ్ సెషన్లన్నీ పూర్తి చేయాలి. ఈ చర్యలను అమలు చేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ శాఖ హెచ్చరించింది.
{{/usCountry}}జిల్లా, మండల విద్యాధికారుల ద్వారా పర్యవేక్షణను ముమ్మరం చేయడంతో పాటు సెలవులు ప్రారంభమయ్యేలోపు విద్యార్థుల కౌన్సెలింగ్ సెషన్లన్నీ పూర్తి చేయాలి. ఈ చర్యలను అమలు చేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ శాఖ హెచ్చరించింది.
{{/usCountry}}