AP SET Hall Ticket : ఏపీ సెట్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
AP SET Hall Ticket : ఏపీ సెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈనెల 28, 29 తేదీల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. apset.aptonline.in వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష(AP SET - 2025)కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు.

ఈనెల 28,29 తేదీల్లో పరీక్షలు…
మార్చి 28, 29 తేదీల్లో ఈ పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేకంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఏపీ సెట్ నిర్వహిస్తారు. ఆఫ్లైన్ లేదా పెన్-అండ్-పేపర్ మోడ్ అనుమతించరు.
ఏపీ సెట్ పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలో పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2 సబ్జెక్ట్ పేపర్ ఉంటాయి. 100 ప్రశ్నలకు 200 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలుగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఏపీ సెట్ అధికారిక వెబ్సైట్ను చెక్ చేయవచ్చు.
ఏపీ సెట్ హాల్ టికెట్ - డౌన్లోడ్ ఇలా:
- అభ్యర్థులు ముందుగా https://apset.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని డౌన్లోడ్ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ ఐడీ, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- గెట్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.
- భవిష్యత్తులో హాల్ టికెట్ అవసరం ఉంటుంది.. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఏపీ సెట్ ఎగ్జామ్ నిర్వహణ తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆపై తుది కీలను ప్రకటించి… ఫలితాలను ప్రకటిస్తారు. సబ్జెక్టుల వారీగా అభ్యర్థులు సాధించే మార్కుల ఆధారంగా కటాఫ్ నిర్ణయించి.. సెట్ పత్రాలను జారీ చేస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

