AP SSC 10th Class Results 2026 : ఏపీ పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు నిరీక్షణకు తెరపడనుంది. ఎంతగానో ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ ఫలితాలను గురువారం(ఏప్రిల్ 30) విడుదల చేసేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు.

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇందులో బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది వరకు ఉన్నారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి నెలలో ప్రారంభమైన ఈ పరీక్షలు ఏప్రిల్ 1తో పూర్తయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో చేపట్టిన మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 15తో ముగిసింది. ఎస్వోలు, సీఎస్లు, క్యాంపు ఆఫీసర్లు, ఉపాధ్యాయులు మూల్యాంకనాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే మార్కులను మాన్యువుల్తో పాటు ట్యాబ్ల్లోనూ నమోదు చేశారు. మార్కుల లెక్కింపులో పొరపాటు లేకుండా ఉండేందుకు ఈ ఏడాది ట్యాబ్లను తీసుకొచ్చారు. మొదట్లో ట్యాబ్ లో ఎంట్రీ చేసే క్రమంలో కొంత జాప్యం జరిగినప్పటికీ… చివరగా ఈ ప్రక్రియ కూడా పూర్తి అయింది. సాంకేతిక ప్రక్రియను, కోడింగ్, డీకోడింగ్ సాంకేతిక పనులను కూడా వేగంగా పూర్తి చేశారు. దీంతో త్వరగానే ఫలితాలను సిద్ధం చేశారు.
ఏపీ పదో తరగతి ఫలితాలను https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లేదా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్ లో చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
వాట్సాప్ లో ఏపీ టెన్త్ ఫలితాలు…
- మీ మొబైల్లో 95523 00009 నంబర్ను సేవ్ చేయండి.
- వాట్సాప్లో ఈ నంబర్కు "Hi" అని మెసేజ్ పంపండి.
- మెనూలో 'Education Services' ఆప్షన్ను ఎంచుకోండి.
- ఆ తర్వాత 'Download SSC Results' పై క్లిక్ చేసి, మీ హాల్ టికెట్ నంబర్ ఇస్తే చాలు. మీ మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది.
ఫలితాల ప్రకటన తర్వాత రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ను ఫలితాల రోజే విద్యాశాఖ విడుదల చేస్తుంది. అంతేకాకుండా ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తారు. ఆ షెడ్యూల్ ను కూడా రేపే ప్రకటించే అవకాశం ఉంటుంది.
{{/usCountry}}ఫలితాల ప్రకటన తర్వాత రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ను ఫలితాల రోజే విద్యాశాఖ విడుదల చేస్తుంది. అంతేకాకుండా ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తారు. ఆ షెడ్యూల్ ను కూడా రేపే ప్రకటించే అవకాశం ఉంటుంది.
{{/usCountry}}