ఏపీ పదో తరగతి విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా…. ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే టెన్త్ పరీక్షల హాల్ టికెట్లను మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నారు. త్వరలోనే అధికారికంగా తేదీని ప్రకటించనున్నారు.
మార్చి 16 నుంచి పరీక్షలు…

రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16న ప్రారంభమై ఏప్రిల్ ఒకటితో ముగుస్తాయి. ఇక మార్చి 20వ తేదీన జరగబోయే ఇంగ్లీష్… మార్చి 21వ తేదీకి మారింది. మిగతా పరీక్షల పాత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు https://www.bse.ap.gov.in/ వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. ఇక విద్యార్థుల పేర్లు, ఇంటి పేర్లు, పుట్టిన తేదీ లాంటి తప్పులు ఉంటే త్వరలోనే సవరణకు అవకాశం కల్పిస్తామని అధికారులు తాజాగా ప్రకటించారు. ఈ విషయంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
ఏపీ పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్…
- మార్చి 16, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 18, 2026 – సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 21, 2026 - ఇంగ్లీష్(ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20)
- మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)
- మార్చి 25, 2026 – ఫిజిక్స్
- మార్చి 28, 2026 – బయాలజీ
- మార్చి 30 , 2026 – సోషల్ స్టడీస్
- మార్చి 31, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
- ఏప్రిల్ 1, 2026 – ఒకేషనల్ కోర్సు