AP TET 2026 Registration : ఏపీ టెట్ - 2026కు అప్లయ్ చేశారా..? దగ్గరపడిన గడువు, డైరెక్ట్ లింక్ ఇదే

AP TET 2026 Registration : ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2026) దరఖాస్తుల గడువు జూలై 5తో ముగియనుంది. ఆగస్టు 5 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా… సెప్టెంబర్ 15న తుది ఫలితాలను విడుదల చేస్తారు.

Published on: Jul 3, 2026, 11:07:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP TET 2026 Registration : ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈనెల 5వ తేదీతో (జూలై 5) దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. చివరి నిమిషంలో వచ్చే సాంకేతిక ఇబ్బందులను నివారించడానికి వీలైనంత త్వరగా అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.

ఏపీ టెట్ 2026 దరఖాస్తులు
ఏపీ టెట్ 2026 దరఖాస్తులు

ముఖ్య వివరాలు :

  • దరఖాస్తులకు ఆఖరి తేదీ : జూలై 5, 2026
  • హాల్ టికెట్ల జారీ : జూలై 25, 2026 నుండి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • పరీక్షల నిర్వహణ : ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (ఆన్‌లైన్ పద్ధతి) రూపంలో నిర్వహిస్తారు.
  • ఫలితాల ప్రకటన : సమాధాన పత్రాల పరిశీలన పూర్తి చేసిన అనంతరం సెప్టెంబర్ 15వ తేదీన తుది ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు.

రాష్ట్రంలో త్వరలోనే భారీ ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే టెట్ నిర్వహించడం సర్వసాధారణం. ఈ పరీక్షలో సాధించే మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో (DSC) 20 శాతం కీలకమైన వెయిటేజీ ఉంటుంది. అందువల్ల ప్రతి మార్కూ అభ్యర్థుల ఉద్యోగ అవకాశాన్ని నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఏపీ టెట్ దరఖాస్తు ప్రాసెస్

  1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in/ ను ఓపెన్ చేయాలి.
  2. హోం పేజీలో కనిపించే 'రిజిస్ట్రేషన్' లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. మీ ప్రాథమిక గుర్తింపు వివరాల (ఆధార్ వివరాలు) ఆధారంగా ప్రాథమిక రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
  4. అనంతరం మీ విద్యా అర్హతలు, వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, నిర్దేశిత పరిమాణంలో ఉన్న ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
  5. దరఖాస్తు రుసుము చెల్లింపు పూర్తి చేసిన తర్వాత, వివరాలన్నీ సరిచూసుకుని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
  6. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవడం మరువకూడదు.

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి ఏపీ టెట్ - 2026కు నేరుగా అప్లయ్ చేసుకోవచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More