ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కీలక ప్రకటన చేసింది. ఏపీ కాలేజియట్ ఎడ్యుకేషన్ సర్వీస్లో జనరల్ రిక్రూట్మెంట్ కింద కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించిన అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. 2026 జూన్ 22న విడుదల చేసిన ఎంపిక నోటిఫికేషన్కు కొనసాగింపుగా ఈ తాజా జాబితాను ఏపీపీఎస్సీ కార్యదర్శి జూలై 14, 2026న అధికారికంగా ప్రకటించారు.

ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వివిధ దశల్లో నిర్వహించిన పరీక్షల ఆధారంగా అభ్యర్థులను తాత్కాలికంగా ఎంపిక చేశారు. రాత పరీక్షలు 15.07.2025 నుండి 23.07.2025 వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు జరిగాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 20.05.2026 నుండి 29.05.2026 వరకు, 06.07.2026న అభ్యర్థుల అసలు ధృవీకరణ పత్రాల పరిశీలన జరిగింది. కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ 10.06.2026 మరియు 06.07.2026 తేదీల్లో నిర్వహించారు. ఈ రిక్రూట్మెంట్లో జోన్-I, జోన్-II, జోన్-III, జోన్-IV పరిధిలో ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్/రిజిస్టర్ నంబర్లను ఏపీపీఎస్సీ ప్రకటించింది.
పరీక్షల్లో విజయం సాధించినంత మాత్రాన నేరుగా నియామక హక్కు లభించదు. అభ్యర్థి క్యారెక్టర్, పూర్వాపరాలు పరిశీలించిన తర్వాతే నియామక అధికారి సంతృప్తి చెందితేనే ఉద్యోగం లభిస్తుంది. అభ్యర్థులు సదరు పోస్టుకు శారీరకంగా ఫిట్గా ఉండాలి. నియామక అధికారులు కోరిన విధంగా నిబంధనల ప్రకారం అసలు ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారం అందించినట్లు లేదా నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైనట్లు కమిషన్ దృష్టికి వస్తే, వారి తాత్కాలిక ఎంపికను ఏ దశలోనైనా రద్దు చేస్తారు.
ఈ ఎంపిక ప్రక్రియ గౌరవనీయ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల (ఏవైనా ఉంటే) అంతిమ తీర్పులకు లోబడి ఉంటుంది. ఫలితాల రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఏవైనా సాంకేతిక లోపాలు దొర్లితే వాటిని సవరించే హక్కు కమిషన్కు ఉంది. ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ ఈ నోటిఫికేషన్తో పూర్తిగా ముగిసిందని ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పష్టం చేశారు.
{{/usCountry}}ఈ ఎంపిక ప్రక్రియ గౌరవనీయ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల (ఏవైనా ఉంటే) అంతిమ తీర్పులకు లోబడి ఉంటుంది. ఫలితాల రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఏవైనా సాంకేతిక లోపాలు దొర్లితే వాటిని సవరించే హక్కు కమిషన్కు ఉంది. ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ ఈ నోటిఫికేషన్తో పూర్తిగా ముగిసిందని ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పష్టం చేశారు.
{{/usCountry}}మిగిలిన తొమ్మిది సబ్జెక్టుల ఫలితాలను తగిన సమయంలో ప్రకటిస్తామని APPSC ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఈ లింక్ క్లిక్ చేసి ఫలితాలు చూడండి.