40,000 హోమ్-స్టేలను ఏర్పాటు చేయాలనే ప్రతిష్టాత్మక ప్రణాళికను ఏఎస్ఆర్ జిల్లా రూపొందించింది. అరకు ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త పర్యాటక విధానానికి అనుగుణంగా ఈ చొరవ ఉంది. ఇది జీవనోపాధిని పెంపొందించడం, గిరిజన ప్రాంతాలకు సందర్శకులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల నివాసితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు.

జిల్లాలో పర్యాటకం విజయవంతం కావడానికి శ్రద్ధగా పనిచేస్తున్నామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. బుధవారం హోమ్-స్టే ఆపరేటర్లతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, పీఎం జుగా పథకం (PMJUGA) పథకం కింద ఇప్పటికే 150 గృహాలు ఆమోదం పొందాయని అన్నారు. ఆర్థిక అడ్డంకులను పరిష్కరించడానికి, ప్రభుత్వం అనేక సబ్సిడీలను అందిస్తోందని చెప్పారు.
'సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (MSMEలు)గా వర్గీకరించిన హోమ్-స్టేలు, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద 35 శాతం సబ్సిడీకి అర్హులు. ఆమోదించిన యూనిట్లు అదనంగా 5 శాతం పెట్టుబడి సబ్సిడీకి అర్హత పొందుతాయి.' అని కలెక్టర్ అన్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు లభిస్తాయని.. రెండు పర్యాటక సీజన్లలో పెట్టుబడులు తిరిగి పొందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారని కలెక్టర్ అన్నారు. నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించడానికి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. విదేశీ, స్వదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి అందించే సౌకర్యాల ఆధారంగా హోమ్-స్టేలను సిల్వర్, గోల్డ్ కేటగిరీలుగా విభజిస్తామన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో భద్రతా కమిటీలను ఏర్పాటు చేస్తామని, పది లేదా అంతకంటే ఎక్కువ హోమ్-స్టేలు ఉన్న ప్రాంతాల్లో, DRDA ద్వారా సంఘాలు ఏర్పాటు చేసి, వాటికి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.
ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ తిరుమణి శ్రీ పూజ మాట్లాడుతూ.. హోమ్-స్టేలు గిరిజన సాంస్కృతి, ఆచారాలు కనిపించేలా ఉండాలన్నారు. ఇవి పర్యాటకులకు గిరిజన ఆచారాలు, ఆహారం, దైనందిన జీవితాన్ని అనుభవించే అవకాశాన్ని కల్పిస్తాయని, స్థానిక ఆదాయాలను కూడా పెంచుతాయని అన్నారు. రాష్ట్ర నోడల్ అధికారి ప్రసన్న లక్ష్మి ఆపరేటర్లను ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సహించారు. ఏవైనా సమస్యల ఉంటే సహాయం చేయడానికి పర్యాటక శాఖ నుండి సాంకేతిక బృందం అందుబాటులో ఉంటుందన్నారు.
{{/usCountry}}ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ తిరుమణి శ్రీ పూజ మాట్లాడుతూ.. హోమ్-స్టేలు గిరిజన సాంస్కృతి, ఆచారాలు కనిపించేలా ఉండాలన్నారు. ఇవి పర్యాటకులకు గిరిజన ఆచారాలు, ఆహారం, దైనందిన జీవితాన్ని అనుభవించే అవకాశాన్ని కల్పిస్తాయని, స్థానిక ఆదాయాలను కూడా పెంచుతాయని అన్నారు. రాష్ట్ర నోడల్ అధికారి ప్రసన్న లక్ష్మి ఆపరేటర్లను ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సహించారు. ఏవైనా సమస్యల ఉంటే సహాయం చేయడానికి పర్యాటక శాఖ నుండి సాంకేతిక బృందం అందుబాటులో ఉంటుందన్నారు.
{{/usCountry}}