...
...
...
Next StoryDown Arrow

AP Assembly LIVE : రాజధానిగా అమరావతి - ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

AP Assembly Live : రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే విభజన చట్టంలో సవరణ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఇదే విషయంపై తీర్మానం చేసి… కేంద్రానికి పంపనుంది. లైవ్ ఇక్కడ చూడండి….

Published on: Mar 28, 2026 11:10 am IST
Advertisement

రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా శాసనసభ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనుంది.

ఏపీ అసెంబ్లీ

ఇవాళ(శనివారం) ఉదయం 11 గంటలకు శాసనసభ మొదలు కాగా… ముందుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభలో చర్చించే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగంతో పాటు పలు అంశాలను వివరించారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఇక్కడ లైవ్ చూడండి….

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Subscribe Now!