ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు అక్కడ ప్రకృతి వైపరీత్యానికి గురై గల్లంతైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. యునైటెడ్ స్టేట్స్లో ఇటీవల ముంచెత్తిన అకాల భారీ వర్షాలు, వరదల ఉధృతికి ఆంధ్రప్రదేశ్కు చెందిన దొప్పలపూడి వెంకటేష్ అనే యువకుడు కొట్టుకుపోయాడు. ఈ దారుణ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా అతని ఆచూకీ లభించకపోవడంతో స్వగ్రామంలోని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం పరిధిలోని దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు కుమారుడు వెంకటేష్ ప్రస్తుతం అమెరికాలోని ఒమాహా నగరంలో నివసిస్తున్నాడు. అయితే ఇటీవల పొరుగు రాష్ట్రమైన కాన్సాస్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో అక్కడ ఊహించని విధంగా భారీ వరదలు ముంచెత్తాయి.
వెల్లింగ్టన్ ప్రాంత సమీపంలోని ఎస్. ఆలివర్ రోడ్ గుండా వెళ్తుండగా వెంకటేష్ ప్రయాణిస్తున్న వాహనం వరద ఉధృతికి చిక్కుకుంది. ప్రమాదవశాత్తూ ఆయన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానిక రెస్క్యూ టీమ్స్ జరిపిన గాలింపులో వెంకటేష్ ప్రయాణించిన కారు, ఆయన బ్యాగు లభ్యమైనప్పటికీ, అతని మొబైల్ ఫోన్ గానీ, వ్యక్తిగత ఆచూకీ గానీ ఇప్పటివరకు లభించలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ కుటుంబంలో భయాందోళనలు తీవ్రమవుతున్నాయి.
బాధిత కుటుంబ సభ్యుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు తక్షణమే స్పందించారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టేలా ఒత్తిడి తేవాలని కోరుతూ ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని కీలక మంత్రులకు విడివిడిగా అత్యవసర లేఖలు రాశారు.
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లకు లేఖలు పంపారు. వాషింగ్టన్లోని ఇండియన్ ఎంబసీ ద్వారా అమెరికా స్థానిక అధికారులతో మాట్లాడి గాలింపు వేగవంతం చేయాలని కోరారు. మంత్రి నారా లోకేష్కు కూడా లేఖ రాస్తూ.. ఏపీ ఎన్ఆర్టీఎస్ విభాగం ద్వారా అమెరికాలోని తెలుగు అసోసియేషన్లను సమన్వయం చేసి బాధితుడి కుటుంబానికి భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లకు లేఖలు పంపారు. వాషింగ్టన్లోని ఇండియన్ ఎంబసీ ద్వారా అమెరికా స్థానిక అధికారులతో మాట్లాడి గాలింపు వేగవంతం చేయాలని కోరారు. మంత్రి నారా లోకేష్కు కూడా లేఖ రాస్తూ.. ఏపీ ఎన్ఆర్టీఎస్ విభాగం ద్వారా అమెరికాలోని తెలుగు అసోసియేషన్లను సమన్వయం చేసి బాధితుడి కుటుంబానికి భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమారుడు క్షేమంగా తిరిగి రావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తమ బిడ్డను అప్పగించాలని వెంకటేష్ తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై తెలుగు కమ్యూనిటీలు సైతం స్పందించి స్థానిక కాన్సాస్ రెస్క్యూ టీమ్స్తో సంప్రదింపులు జరుపుతున్నాయి.