ఈ రూట్లలోని స్పెషల్ ట్రైన్స్ సర్వీసులు పొడిగింపు.. ఏయే తేదీల్లో ఉన్నాయ్?
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే ప్రత్యేక సర్వీసులను పొడిగించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటకలాంటి రాష్ట్రాల మధ్య ప్రయాణించేవారికి ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి.
ప్రయాణికుల డిమాండ్లో నిరంతర పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, షాలిమార్, చర్లపల్లి వంటి కీలక గమ్యస్థానాలను కలిపే అనేక వేసవి ప్రత్యేక రైళ్ల కార్యకలాపాలను భారతీయ రైల్వే పొడిగించింది. అదనపు ట్రిప్పులు నడుపుతోంది. దీంతో మెరుగైన కనెక్టివిటీ ఉంటుంది. సమ్మర్ ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది.

ట్రైన్ నెంబర్ 02811 భువనేశ్వర్-యశ్వంతపూర్ రైలు జూలై 4 నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు నడవనుంది. మెుత్తం 9 సర్వీసులు నడుస్తాయి. ప్రతీ శనివారం ఉంటుంది.
02812 నెంబర్ ట్రైన్ యశ్వంతపూర్-భువనేశ్వర్ మధ్య ప్రతీ సోమవారం జూలై 6 నుంచి ఆగస్టు 31 మధ్య తొమ్మిది సర్వీసులు నడుపనుంది.
08581 ట్రైన్ విశాఖపట్నం-ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య జూలై 3 నుంచి జూలై 31 వరకు ప్రతీ శుక్రవారం నడుస్తాయి. మెుత్తం 5 సర్వీసులు నడపనున్నారు.
ట్రైన్ నెంబర్ 08582 ఎస్ఎంవీటీ బెంగళూరు-విశాఖపట్నం మధ్య ప్రతీ శనివారం నడుస్తుంది. అయితే ఈ సర్వీస్ జూలై 4 నుంచి ఆగస్టు 1 వరకు ఉంటుంది.
08045 ట్రైన్ షాలిమార్-చర్లపల్లి మధ్య ప్రతీ శుక్రవారం జూలై 3 నుంచి జూలై 10 వరకు, మళ్లీ జూలై 17 నుంచి జూలై 31 వరకు 5 సర్వీసులు నడుస్తుంది.
08046 చర్లపల్లి-షాలిమార్ ప్రతీ శనివారం జూలై 4 నుంచి జూలై 11 వరకు, జూలై 18 నుంచి ఆగస్టు 1 వరకు 5 సర్వీసులు నడవనుంది.
చర్లపల్లి-కాకినాడ-చర్లపల్లి
07817 ట్రైన్ నెంబర్ చర్లపల్లి కాకినాడ మధ్య గురువారం జూన్ 25వ తేదీన ఉంది. 07818 కాకినాడ-చర్లపల్లి ట్రైన్ జూన్ 28వ తేదీన ఆదివారం రోజున ఉంది.
ఈ సర్వీస్ ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, రాజమండ్రి, సామర్లకోటలో ఆగుతుంది.
చర్లపల్లి-తిరుపతి
07819 చర్లపల్లి-తిరుపతి 25.06.2026, 27.06.2026 తేదీల్లో గురు, శనివారం రెండు సర్వీసులు ఉంటాయి. చర్లపల్లి నుంచి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ట్రైన్ వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం 07:30కి తిరుపతి చేరుకుంటుంది.
07820 తిరుపతి-చర్లపల్లి 26.06.2026, 28.06.2026 తేదీల్లో శుక్ర, ఆది వారాల్లో 2 సర్వీసులు నడుస్తాయి. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 4:30కి చర్లపల్లికి చేరుకుంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


