అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా అధికారికంగా గుర్తించేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు, 2026ను ఏప్రిల్ 1వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. అమరావతిని ఒకే రాజధానిగా కొనసాగించాలన్న టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి చట్టబద్ధత కల్పిస్తూ.. మార్చి 28న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు. ఈ బిల్లు అమరావతి హోదాను సురక్షితం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

కేంద్ర హోంశాఖ బుధవారం లోక్సభలో ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో ఈ బిల్లు ప్రవేశపెడుతుంది. ఈ మేరకు బిజినెస్ జాబితాలో దీన్ని చేర్చారు. ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ ముందుకు వెళ్తుంది. రెండ్రోజుల్లో ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందనుంది.
ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 2కి సవరణలు చేస్తున్నట్లు బిల్లులో కేంద్రం పేర్కొంది. సబ్ సెక్షన్ 2లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏర్పడిందని కేంద్రం తెలిపింది. ఏపీ సీఆర్డీఏ చట్టంలోని క్యాపిటల్ ఏరియాలో అమరావతి ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.
అమరావతికి రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ.. మార్చి 28న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఈ తీర్మానాన్ని పరిశీలన కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపారు.
రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం శాసన ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ సవరణ అమరావతి అభివృద్ధికి నిధుల సమీకరణను సులభతరం చేయడంతో పాటు, రాజధాని హోదాలో సంభవించే ఏవైనా మార్పులతో సహా భవిష్యత్తు అనిశ్చితుల నుండి చట్టపరమైన రక్షణను కూడా కల్పిస్తుందని భావిస్తున్నారు.
అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారికంగా ప్రకటించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1న లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026ను ప్రవేశపెట్టనుంది. వాస్తవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికీ 10 సంవత్సరాలపాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా నిర్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 5ను సవరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.
{{/usCountry}}అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారికంగా ప్రకటించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1న లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026ను ప్రవేశపెట్టనుంది. వాస్తవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికీ 10 సంవత్సరాలపాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా నిర్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 5ను సవరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.
{{/usCountry}}ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని చట్టం చెబుతోంది. రాజధానిగా అమరావతి హోదాపై చట్టపరమైన స్పష్టతను అందించేందుకు.. ఈ సవరణను 2024 జూన్ 2 నుండి అమలులోకి వచ్చేలా ప్రతిపాదించారు.