...
...
Next Story

Road Accident : ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు దుర్మరణం

Road Accident In Chittoor : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబంలో ఐదుగురు రోడ్డు ప్రమాదంలో మరణించారు.

Published on: Mar 4, 2026, 11:19:25 IST
Advertisement

చిత్తూరు జిల్లాలో బుధవారం ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని.. వేగంగా వచ్చిన కారు వెనకాల నుంచి ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చిత్తూరు రోడ్డు ప్రమాదం
చిత్తూరు రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లా గంగవరం మండలం దండపల్లి క్రాస్ వద్ద బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. మృతులను కర్ణాటక వాసులుగా గుర్తించారు. మృతులు మోహన్‌దాస్, నాగరాజారావు, కుసుమ, జయంతి, పూజ.

బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది.

తిరుపతిలో యువకుడు మృతి

మరోవైపు తిరుపతిలో అతిగా మద్యం తాగి ఓ యువకుడు కాలువలో పడి చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్టీవీ నగర్‌‌లోని ప్రధాన మురుగు కాలువలో మృతదేహం ఉన్నట్టుగా పారిశుధ్య కార్మికులు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెళ్లి పరిశీలన చేశారు.

ఆటోడ్రైవర్ దివాకర్‌గా గుర్తించారు. కొందరు స్నేహితులతో కలిసి మద్యం తాగాడు దివాకర్. తర్వాత ఇంటికి వచ్చి మద్యం కోసం డబ్బులు ఇవ్వమని భార్యతో గొడవకు దిగాడు. తర్వాత బైక్ మీద దుకాణానికి వెళ్లి మద్యం కొనుగోలు చేశాడు. మురుగు కాల్వ దగ్గరకు మూత్ర విసర్జన చేస్తూ.. కాలువలో పడిపోయి మరణించాడని ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ మరణంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. చొక్కా లేకుండా ఎందుకు నిలబడినట్టు, చిన్న కాలువలో ఎలా చనిపోయాడనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe