...
...
Next Story

సోమ, మంగళవారాల్లో ఏపీలో కేంద్ర బృందం పర్యటన.. మెుంథా తుపాను నష్టం అంచనా!

ఇటీవల మెుంథా తుపాను ఏపీని తీవ్రంగా ముంచేసింది. దీనితో చాలా రకాలుగా రాష్ట్రం నష్టపోయింది. ఈ నష్టాన్ని అంచనా వేసేందుకు సోమ, మంగళవారాల్లో కేంద్ర ప్రభుత్వం ఏపీలో పర్యటిస్తోంది.

Published on: Nov 9, 2025, 17:45:14 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో మెుంథా తుపాను వల్ల జరిగిన నష్టాలను అంచనా వేయడానికి ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం సోమ, మంగళవారాల్లో పర్యటిస్తోంది. హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలోని బృందం (IMCT) తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి నష్టాల పరిధిని అంచనా వేస్తుంది.

మెుంథా తుపాను నష్టం
మెుంథా తుపాను నష్టం

'నష్టాలను పరిశీలించడానికి, ప్రభావిత కుటుంబాలతో నేరుగా సంభాషించడానికి కేంద్ర బృందం రెండు రోజుల పాటు ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తుంది.' అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ తెలిపారు.

ప్రఖార్ జైన్ ప్రకారం, సోమవారం టీమ్-1 బాపట్ల జిల్లాను, టీమ్-2 కృష్ణ, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలను సందర్శిస్తాయి, మరుసటి రోజు ఈ బృందాలు ప్రకాశం, కోనసీమ జిల్లాలను పర్యటిస్తాయని తెలిపారు. కేంద్ర బృందంలో వ్యవసాయం, వ్యయం, జల వనరులు, రహదారులు, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, ఇతర విభాగాల అధికారులు ఉన్నారని, వీరు భారత ప్రభుత్వంలోని పలు మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని జైన్ అన్నారు.

ఈ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాయని, వ్యవసాయం, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల నష్టాలను సమీక్షిస్తాయని, ప్రభుత్వ మూల్యాంకనం, సహాయం కోసం తుపాను ప్రభావంపై నివేదికలను సిద్ధం చేస్తాయని ప్రఖార్ జైన్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాల్లో మెుంథా తుపాను కారణంగా సంభవించిన విధ్వంసం, భారీ వర్షాల సమయంలో పంట నష్టం, మౌలిక సదుపాయాల నష్టం, బాధిత కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఈ సంఘటనల నేపథ్యంలో కేంద్రం బృందం ఏపీలో పర్యటిస్తుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe