రాజధాని అమరావతిలో నిప్పుపై నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలు నిజంగా ప్రమాదాలా…? లేక దాని వెనుక కుట్ర కోణం ఉందా…? అనేది వెలికి తీయాలని సిఎం ఆదేశించారు.

అమరావతిలో వరుస ఘటనలు, అవి జరుగుతున్న తీరు చూస్తుంటే కుట్ర కోణం ఉందనే అనుమానం వస్తోందని... ఆ దిశగా మరింత లోతుగా అన్నికోణాల్లోనూ విచారణ జరపాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు... ఇప్పుడు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని కుట్ర కోణం ఉందా అనే విషయం కూడా విశ్లేషించాలన్నారు.
రాయపూడిలో హెచ్వోడీ టవర్ల నిర్మాణం వద్ద నిర్మాణ సంస్థకు చెందిన పైపులు గత రాత్రి దగ్ధం అయిన ఘటనపై సచివాలయంలోని తన చాంబర్లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, ఇంటలిజెన్స్ చీఫ్ మహేష్ కుమార్ లడ్హాలతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రమద ఘటన గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏ సమయంలో ప్రమాదం జరిగింది... ఎన్నింటికి అగ్నిప్రమాదంపై ఫైరింజన్కు కాల్ వచ్చింది అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలో అంత త్వరగా మంటలు వ్యాపించడానికి కారణాలు ఏంటని అడిగి తెలుసుకున్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ద్వారా ఘటనకు కారణాలను కనిపెట్టాలని సిఎం సూచించారు.
సీసీ కెమెరాలు పెట్టాలి - సీఎం
రాజధానిలో పెద్దఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కోట్ల విలువైన సామగ్రి రాజధాని ప్రాంతంలో నిల్వచేసి పెట్టారని…. పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఇలాంటి సమయంలో జరుగుతున్న ఘటన వల్ల అనవసరమైన అడ్డంకులు ఏర్పడతాయన్నారు. ఈ నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
{{/usCountry}}రాజధానిలో పెద్దఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కోట్ల విలువైన సామగ్రి రాజధాని ప్రాంతంలో నిల్వచేసి పెట్టారని…. పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఇలాంటి సమయంలో జరుగుతున్న ఘటన వల్ల అనవసరమైన అడ్డంకులు ఏర్పడతాయన్నారు. ఈ నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
{{/usCountry}}“రాజధాని ప్రాంతంలో, పనులు జరుగతున్న దగ్గర అదనపు పెట్రోలింగ్ నిర్వహించాలి. ప్రతి నిర్మాణ సంస్థ తమ సామగ్రి నిల్వ చేసుకునే యార్డులో సిసి కెమేరాలు తప్పక ఏర్పాటు చేయాలి. అదే విధంగా సామగ్రి నిల్వ కేంద్రాల వద్ద వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. డ్రోన్ కెమెరాలు ద్వారా ఆయా ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించాలి. తమ సామగ్రి ఉన్న యార్డుల వద్ద తగిన భద్రత ఏర్పాటు చేసుకోవడంతో పాటు, భద్రతా చర్యలు చేపట్టడంపై కూడా నిర్మాణ సంస్థలు దృష్టి పెట్టాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అనుమానితుల కదలికలపై నిఘా పెట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వారి రాకపోకలను కూడా గమనించాలన్నారు. అనుమానితులు ఉంటే ప్రశ్నించాలని ముఖ్యమంత్రి సూచించారు. వరుస ఘటనలో అలజడి సృష్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టు తేలితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించ వద్దని... కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.