ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. పునర్విభజనపై గత నెల 27న జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల కాగా… వీటిపై అభ్యంతరాల గడువు నేటితో ముగుస్తోంది. దీంతో వీటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అభ్యంతరాలపై చర్చ…!

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సమీక్షించిన సీఎం చంద్రబాబు…. మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. కొన్నింటిని మార్పు చేసే విషయంపై సమాలోచనలు జరిపారు. అయితే రాజంపేటను కడపలో, రాయచోటిని మదనపల్లెలో కలిపే ప్రతిపాదనలపై చర్చించినట్లు తెలిసింది.
ఇప్పటికే ప్రకటించిన మదనపల్లె, పోలవరం, మార్కాపురం జిల్లాలతో ఏపీలో జిల్లాల సంఖ్య 29కి పెరగాల్సి ఉంది. అయితే తాజా ప్రతిపాదనలు, జరిగిన చర్చల నేపథ్యంలో….. 28 జిల్లాలకే పరిమితం చేసే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిని మదనపల్లెలో కలిపే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. వీటన్నింటిపై సాధ్యాసాదాలు పరిశీలన పూర్తి కాగానే… డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
మంత్రి రాంప్రసాద్ రెడ్డి రియాక్షన్:
అన్నమయ్య జిల్లాపై వస్తున్న వదంతులను నమ్మవద్దని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(రాయచోటి ఎమ్మెల్యే) స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.
{{/usCountry}}అన్నమయ్య జిల్లాపై వస్తున్న వదంతులను నమ్మవద్దని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(రాయచోటి ఎమ్మెల్యే) స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.
{{/usCountry}}అన్నమయ్య జిల్లా ముక్కలు కాబోతోందంటూ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆకాంక్షలను అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. జిల్లా ముక్కలు కాబోతోందంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు. ఇది ఫైనల్ నిర్ణయం కాదని… చర్చలు తర్వాతనే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.