అయోధ్య పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యకు బయల్దేరారు. రామ మందిరాన్ని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం తర్వాత విజయవాడకు తిరిగి రానున్నారు.

Published on: Dec 28, 2025 10:33 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రామ మందిర దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అయోధ్యకు బయల్దేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు…. శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్ లో దర్శనం చేసుకోనున్నారు. రామ మందిరాన్ని దర్శించుకునేందుకు చంద్రబాబు నాయుడు ఈ ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి అయోధ్యకు బయలుదేరారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో దాదాపు మూడు గంటలు గడిపనున్నారు. ఆ తర్వాత తిరిగి విజయవాడకు తిరిగి వస్తారు. గతేడాది ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు… ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి.