దిత్వా తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. అయితే రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలహీన పడనుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇది ప్రస్తుతం నైరుతీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతాలను ఆనుకుని కొనసాగుతోందన్నారు. చెన్నైలో నిరంతరాయంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, తుపాను తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు కనీసం 35 కి.మీ దూరంలో ఉంది. వర్షాల కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఈ వాయుగుండం చెన్నై తీరానికి దగ్గరలో ఉత్తర దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. నెల్లూరుకి 200 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. దీని కారణంగా మూడు రోజులు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, దక్షిణ, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ మాట్లాడుతూ తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇతర తీరప్రాంతాల్లో కూడా వర్షాలు పడనున్నట్టుగా చెప్పారు.
మరోవైపు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో అనేక ప్రాంతాలు తీవ్ర జలదిగ్బంధాన్ని ఎదుర్కొన్నాయి. దక్షిణ చెన్నైలోని వేలచేరి, ఇతర ప్రాంతాల్లో సహాయక చర్యలకు కోసం పడవలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. శివారు ప్రాంతాలు కూడా వరదలకు ప్రభావితం అవుతున్నాయి. రామేశ్వరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తంగచిమడంలోని దాదాపు 200 నివాసాలు మునిగిపోయాయి.
{{/usCountry}}మరోవైపు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో అనేక ప్రాంతాలు తీవ్ర జలదిగ్బంధాన్ని ఎదుర్కొన్నాయి. దక్షిణ చెన్నైలోని వేలచేరి, ఇతర ప్రాంతాల్లో సహాయక చర్యలకు కోసం పడవలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. శివారు ప్రాంతాలు కూడా వరదలకు ప్రభావితం అవుతున్నాయి. రామేశ్వరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తంగచిమడంలోని దాదాపు 200 నివాసాలు మునిగిపోయాయి.
{{/usCountry}}IMD ప్రకారం, దిత్వా తుపాను గత ఆరు గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో నెమ్మదిగా ఉత్తరం వైపుకు కదిలింది. ఇది నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య, ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం ఆనుకుని ఉన్న ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 50 కి.మీ, పుదుచ్చేరికి ఈశాన్యంగా 130 కి.మీ, కడలూరుకు ఈశాన్యంగా 150 కి.మీ, నెల్లూరుకు ఆగ్నేయంగా 200 కి.మీ దూరంలో ఉంది.