ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (అక్టోబర్ సెషన్ 2025)కు సంబంధించి విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. ఆన్లైన్ మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ అవకాశాన్ని కల్పించింది.
మాక్ టెస్టులు ఇలా రాసుకోవచ్చు…
- ఏపీ టెట్ అభ్యర్థులు ముందుగా https://tet2dsc.apcfss.in/# వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని మాక్ టెస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మొత్తం 13 సబ్జెక్టుల పేర్లు కనిపిస్తాయి. మీకు అప్లయ్ చేసిన సబ్జెక్ట్ పక్కన ఉండే లింక్ పై క్లిక్ చేయాలి.
- ఎలాంటి పాస్వర్డ్ లేకుండా సైన్-ఇన్ అవడం ద్వారా ఉచిత మాక్ టెస్టులను ఉపయోగించుకోవచ్చు.
- ఈ పరీక్షలను రాయటం ద్వారా పరీక్షా విధానంతో పాటు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఓ అవగాహనకు రావొచ్చు.

ఏపీ టెట్ పరీక్షలు డిసెంబర్ 10, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ప్రతి రోజూ 2 సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతిదీ కూడా ఒక మార్కును కలిగి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
షెడ్యూల్ ప్రకారం ప్రాథమిక కీ 2026 జనవరి 2న, ఫైనల్ కీ జనవరి 13న, తుది ఫలితాలు 19న విడుదలవుతాయి. ఏవైనా సందేహాలు ఉంటే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నంబర్లను (8121947387, 8125046997, 7995649286, 7995789286, 9963069286, 6281704160) సంప్రదించవచ్చు.