మద్యం మత్తు, క్షణికావేశం రెండు కుటుంబాల్లో కోలుకోలేని విషాదాన్ని నింపాయి. కాబోయే భర్తతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఒక యువ వైద్యురాలు, ఇద్దరు పోకిరీల ఉన్మాదానికి బలవుతూ ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న ఈ ఘోర ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సష్టించింది.

సోమవారం రాత్రి ఈ దారుణం జరగ్గా.. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో గురువారం నాడు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ప్రియాంక అనే యువతి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఒక ప్రైవేట్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగాలో పీజీ (వైద్య విద్య) అభ్యసిస్తోంది. సోమవారం రాత్రి ఆమె తన సహచర విద్యార్థినితో కలిసి రాజమహేంద్రవరంలోని ఏ.వి. అప్పారావు రోడ్డులో ఉన్న ఐనాక్స్ థియేటర్లో ఫస్ట్ షో సినిమా చూసేందుకు వెళ్లింది.
అదే సమయంలో బి.టెక్ చదువుతున్న సురవరవరపు దష్వంత్, అతని బంధువు ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్ అనే ఇద్దరు యువకులు సెకండ్ షో సినిమా కోసం అక్కడికి వచ్చారు. థియేటర్ లోపలికి వెళ్లే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించినట్లు తేలడంతో లోపలికి అనుమతించలేదు.
సినిమాకు అనుమతించకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువకులు పార్కింగ్ వైపు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో ఫస్ట్ షో ముగించుకుని ఆ ఇద్దరు మెడికల్ విద్యార్థినిలు తమ ద్విచక్రవాహనంపై బయటకు వస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు వారి బైక్ను కారులో అనుసరిస్తూ ఉద్దేశపూర్వకంగానే వెనక నుంచి రెండుసార్లు ఢీకొట్టారు. మూడోసారి మరింత వేగంగా, బలంగా ఢీకొట్టడంతో బైక్ వెనక కూర్చున్న ప్రియాంక రోడ్డుపై పడిపోయింది. ఆ తాగుబోతులు కారును ఆమె పైనుంచి తొక్కిస్తూ అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై రక్తం మడుగులో పడివున్న వారిని గమనించిన ఓ వ్యక్తి వెంటనే స్పందించి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రియాంక పరిస్థితి విషమించడంతో ఆమె కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. త్వరలోనే హైదరాబాద్కు చెందిన ఒక కార్డియాలజిస్ట్తో ప్రియాంకకు వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది. అనుకోని ఈ ఘోరంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
{{/usCountry}}ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై రక్తం మడుగులో పడివున్న వారిని గమనించిన ఓ వ్యక్తి వెంటనే స్పందించి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రియాంక పరిస్థితి విషమించడంతో ఆమె కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. త్వరలోనే హైదరాబాద్కు చెందిన ఒక కార్డియాలజిస్ట్తో ప్రియాంకకు వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది. అనుకోని ఈ ఘోరంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
{{/usCountry}}సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సౌత్ జోన్ డిఎస్పి ఎ. సుభాష్, ప్రకాష్ నగర్ సిఐ ఆర్.ఎస్.కె. బాజీ లాల్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితులపై కేసు నమోదు చేశామని తెలిపారు. అలాగే థియేటర్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరొక కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతామని అధికారులు స్పష్టం చేశారు.