భారతీయ రైల్వే చరిత్రలో తొలి రోబో పోలీస్ వచ్చేశాడు. ఇందుకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ వేదికైంది. తూర్పుకోస్తా జోన్ వాల్తేరు డివిజన్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ)అలోక్ బొహ్రా, డీఆర్ఎం లలిత్బొహ్రా చేతుల మీదుగా ఈ రోబో కాప్ ను ఆవిష్కరించారు.
ఇదే తొలిసారి…

ప్రయాణీకుల భద్రతా సేవలను మరింత పెంపొందిచే దిశగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడిన రోబ్ పోలీసును ఏర్పాటు చేశారు. దీనికి "ఏఎస్సీ అర్జున్" గా పేరు పెట్టగా… భారతీయ రైల్వేలో ఇది మొదటిది.
ఈ రోబోను పూర్తిగా విశాఖపట్నంలో రూపొందించి అభివృద్ధి చేశారు. దేశీయ ఆవిష్కరణల ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరిచారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ అలోక్ బోహ్రా మరియు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా మార్గదర్శకత్వంలో ఎ.కె. దూబే నేతృత్వంలోని బృందం ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా అభివృద్ధి చేయడానికి ఒక సంవత్సరానికిపైగా శ్రమించారు.
"ASP ARJUN" అనేక కీలక కార్యాచరణలను కలిగి ఉంటుంది. చొరబాటు వంటి సమస్యలను సులభంగా గుర్తిస్తుంది. దీనిలోని రోబోట్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ఉపయోగించి చొరబాటుదారులను గుర్తిస్తుంది. IOT-ఎనేబుల్డ్ హెచ్చరికల ద్వారా RPF సిబ్బందిని తక్షణమే అప్రమత్తం చేయగలదు. రద్దీ నిర్వహణలో కూడా కీలక సూచనలు చేస్తుంది.
రద్దీ నియంత్రణకు సంబంధించిన సందేశాలను కూడా ఈ రోబ్ పోలీస్ పంపుతుంది. భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. సమాచార ప్రకటనలను ఇంగ్లీష్, హిందీ మరియు తెలుగులో అందించబడతాయి. రద్దీ సమయాల్లో ప్రజలకు సమర్థవంతంగా మార్గనిర్దేశం చేయడానికి వీలు కల్పిస్తుంది.
ఈ సరికొత్త సేవలతో భద్రతా సిబ్బందిపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అగ్నిప్రమాదం వంటి ఘటనల సమయంలో తక్షణ హెచ్చరికలను జారీ చేయగలదు. ప్రయాణీకులకు నమస్తే, ఆర్పీఎఫ్ అధికారులకు వందనం వంటి సాంస్కృతిక హావభావాలను కూడా ఈ రోబో పోలీస్ కలిగి ఉంటుంది. ఆర్పీఎఫ్ కంట్రోల్ రూమ్ తో రియల్ టైమ్ ఐఓటీ కనెక్టివిటీ ఉంటుంది.
{{/usCountry}}ఈ సరికొత్త సేవలతో భద్రతా సిబ్బందిపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అగ్నిప్రమాదం వంటి ఘటనల సమయంలో తక్షణ హెచ్చరికలను జారీ చేయగలదు. ప్రయాణీకులకు నమస్తే, ఆర్పీఎఫ్ అధికారులకు వందనం వంటి సాంస్కృతిక హావభావాలను కూడా ఈ రోబో పోలీస్ కలిగి ఉంటుంది. ఆర్పీఎఫ్ కంట్రోల్ రూమ్ తో రియల్ టైమ్ ఐఓటీ కనెక్టివిటీ ఉంటుంది.
{{/usCountry}}స్టేషన్లో నిత్యం పహారా కాస్తు అనుమానితులను గుర్తించడం, చొరబాటుదారులను కనుగొనడం వంటివి ఈ రోబో కాప్ చేస్తుంది. తరచూ దొంగతనాలకు పాల్పడేవారిని, అనుమానితుల చిత్రాలు తీసి విశ్లేషించి గుర్తించడంలో సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు.