ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

గత వైసీపీ హయాంలో మద్యం కేటాయింపుల అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసును సీఐడీ ప్రత్యేకంగా విచారిస్తోంది. సీఐడీ విచారణ ఆధారంగానే ఈడీ కూడా ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇప్పటికే ఈ కేసులో సీఐడీ విచారణకు కూడా విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఆయన్నుంచి పలు కీలక సమాచారాన్ని కూడా సేకరించారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈడీ నోటీసులు ఇవ్వటం కీలకంగా మారింది. అయితే ఈనెల 22వ తేదీన విజయసాయిరెడ్డి హాజరయ్యేతే… ఎలాంటి ప్రశ్నలను ఎదుర్కొంటారనేది ఉత్కంఠగా మారింది. ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా…. నెక్స్ట్స్ ఈడీ మరికొంత మందిని విచారించే అవకాశం కూడా కనిపిస్తోంది.