...
...
Next Story

AP Mega DSC 2025 Selections : మెగా డీఎస్సీ 2025లో అక్రమాలు అవాస్తవం - మరోసారి పాఠశాల విద్యాశాఖ వివరణ

మెగా డీఎస్సీ-2025 నియామకాలు పారదర్శకంగా జరిగాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా తెలిపారు. PwBD, స్పోర్ట్స్ కోటా నియామకాలపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు.

Published on: Aug 7, 2026, 21:25:41 IST
Advertisement

రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన మెగా డీఎస్సీ-2025 నియామకాల ప్రక్రియపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా తీవ్రంగా ఖండించారు. మెరిట్ జాబితాలో రావాల్సాిన ఉద్యోగాలను దివ్యాంగులకు (PwBD) కేటాయించడం వల్ల నష్టం జరిగిందంటూ కొందరు అభ్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని ఆమె తప్పుపట్టారు.

చట్టబద్ధంగానే నియామక ప్రక్రియ - తమీమ్ అన్సారియా

ఏపీ డీఎస్సీపై విద్యాశాఖ మరోసారి క్లారిటీ
ఏపీ డీఎస్సీపై విద్యాశాఖ మరోసారి క్లారిటీ

శుక్రవారం అమరావతి సచివాలయంలోని ప్రచార విభాగంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భరణితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 77 ప్రకారం హారిజాంతల్ రిజర్వేషన్లు, రోస్టర్ విధానం, అత్యంత మెరిట్ ప్రాతిపదికన చట్టబద్ధంగానే ఈ నియామక ప్రక్రియ సాగిందని కమిషనర్ స్పష్టం చేశారు. దివ్యాంగ అభ్యర్థులకు వర్తించే నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం తగదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా దేవగుప్తపు సంతోషి పార్వతి కేసు,భాస్కర్ రెడ్డి కేసును వివరించారు.

జీవో 77 ప్రకారం గతంలో లాగా ప్రత్యేక రోస్టర్ పాయింట్లు కేటాయించే పద్ధతికి స్వస్తి పలికామని అన్సారియా వెల్లడించారు. దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులు, క్రీడాకారులకు వారి వర్టికల్/కమ్యూనిటీ రోస్టర్‌లోనే సర్దుబాటు చేసే ఆధునిక హారిజాంతల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీనిని జనరల్ మెరిట్ అభ్యర్థులను తొలగించడంగా చిత్రీకరించడం సమంజసం కాదన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి 5,77,675 దరఖాస్తులు రాగా, 3,36,300 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. 154 కేంద్రాల్లో 24 రోజుల పాటు 89 సెషన్లలో అత్యంత పారదర్శకంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షనిర్వహించారు. ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లపై వచ్చిన అభ్యంతరాలను నిపుణులతో పరిశీలించి నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా తుది స్కోర్లు వెల్లడించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం 15,941 మంది ఎంపికను ఆమోదించామని, వచ్చిన 1,135 గ్రీవెన్సులను ఎప్పటికప్పుడు పరిష్కరించామని తెలిపారు.

శాప్ ఎండీ వివరణ…

స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వైరల్ అయిన ఒక అనుమానాస్పద ఆడియో క్లిప్‌పై శాప్ తక్షణమే స్పందించిందని భరణి చెప్పారు. జులై 25, 2025న విజయవాడ పోలీస్ కమిషనర్‌కు, జులై 28న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విచారణ జరిపి ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే అర్హులైన నిజమైన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చామని… ఆధారాలు లేని సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దని ఆమె కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe