...
...
Next Story

Tirumala Srivari Brahmotsavam : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు - 3 వేల కెమెరాలతో సమగ్ర నిఘా!

Tirumala Srivari Brahmotsavam 2026 : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీతో పాటు తిరుపతి జిల్లా యంత్రాంగం అత్యంత పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. 3 వేల కెమెరాలు, డ్రోన్ల నిఘా, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని పర్యవేక్షించనున్నారు.

Published on: Sep 9, 2026, 09:46:02 IST
Advertisement

Tirumala Srivari Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమలలో అత్యంత వైభవంగా జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. దేశవిదేశాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా…. స్వామివారి దివ్య దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ, తిరుపతి జిల్లా యంత్రాంగం, పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో విస్తృతమైన ఏర్పాట్లు చేపడుతున్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

ఈ ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు. భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే పనులపై చర్చించారు.

ప్రత్యేక హోల్డింగ్ పాయింట్లు, భారీ స్క్రీన్లు…

బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వాహన సేవలను అందరూ ప్రశాంతంగా వీక్షించేలా ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. తిరుపతి నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయాలతో పాటు హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు.

తిరుమలలోని రద్దీకి అనుగుణంగా తిరుపతిలోనే భక్తులను క్రమబద్ధీకరించి పంపుతారు. భక్తుల సౌకర్యార్థం హోల్డింగ్ పాయింట్ల వద్ద పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి స్వామివారి వాహనసేవలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆయా కేంద్రాల్లో ఉచిత అన్నప్రసాదం, తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వేంకటేశ్వర్ వివరించారు.

3,000 కెమెరాలు, ఏఐ సాంకేతికతతో నిఘా…

భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ స్పష్టం చేశారు. తిరుమల, తిరుపతి అంతటా సుమారు 3,000 సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుంది.

గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మార్పులు చేశామని…. టీటీడీ, పోలీసు, మున్సిపల్, రవాణా, ఆరోగ్య శాఖలు ఒకే బృందంగా పనిచేసేలా కమాండ్ కంట్రోల్ వ్యవస్థను రూపొందించామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.

సోషల్ మీడియాలో వ్యాపించే ప్రచారాలు, సమాచారంపై తక్షణమే స్పందించేందుకు ఒక ప్రత్యేక రెస్పాన్సివ్ టీమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీములను సిద్ధంగా ఉంచారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks