రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటికీ ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో కృష్ణా డెల్టా పరిధిలోని సాగు నీటి కష్టాలపై ఆందోళన నెలకొంది. దీంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం కృష్ణా డెల్టా రైతులకు వరప్రదాయినిగా మారింది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లించడం ద్వారా పంటలను కాపాడేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

జూలై 1వ తేదీన పులిచింతల ప్రాజెక్టు నుండి ప్రకాశం బ్యారేజ్ మీదుగా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసినప్పటికీ ఆ ప్రవాహం సాగు అవసరాలకు ఏమాత్రం సరిపోలేదు. ఈ నేపథ్యంలో పట్టిసీమ వద్ద గోదావరి నీటి మట్టాలు పెరగడంతో నీటిపారుదల శాఖ అధికారులు పంపింగ్ ప్రక్రియను తిరిగి ప్రారంభించారు.
పట్టిసీమ ప్రాజెక్టులో మొత్తం 24 పంపులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా గరిష్టంగా 8,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయవచ్చు. ప్రస్తుతం ఇందులో 20 పంపులను నిరంతరాయంగా నడుపుతూ, సుమారు 7,080 క్యూసెక్కుల నీటిని కృష్ణా కాలువల్లోకి పంపింగ్ చేస్తున్నారు. పట్టిసీమ నుండి బయలుదేరిన ఈ గోదావరి జలాలు.. 188 కిలోమీటర్ల దూరం ప్రయాణించి శనివారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీకి చేరుకున్నాయి. ఆదివారం ఉదయానికి పవిత్ర సంగమానికి 3,750 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. సాయంత్రానికి అది 4,800 క్యూసెక్కులకు పెరిగింది.
గోదావరి జలాలు తోడవ్వడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి లభ్యత పెరిగింది. దీంతో అధికారులు కృష్ణా వెస్ట్రన్ కెనాల్ మినహా, మిగిలిన డెల్టా కాలువల వ్యవస్థకు నీటి విడుదలను 5,322 క్యూసెక్కులకు పెంచారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు గేట్లు పూర్తిగా మూసివేసి ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీకి చేరుతున్న నీరంతా పట్టిసీమ నుండి వస్తున్నదే. కృష్ణా డెల్టాలోని దాదాపు అన్ని ప్రధాన కాలువలకు గరిష్ట స్థాయిలో నీటిని సరఫరా చేస్తున్నారు.
2015లో ప్రారంభమైన పట్టిసీమ ఎత్తిపోతల పథకం.. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంలో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. కరవు లేదా వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారీ ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అన్నదాతలను ఆదుకుంటూనే ఉంది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా సుమారు 442 టీఎంసీల గోదావరి మిగులు జలాలను కృష్ణా బేసిన్కు విజయవంతంగా మళ్లించారు. ప్రస్తుత ఎల్ నినో సంవత్సరంలోనూ ఈ జలాలు చేరడంతో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల పరిధిలోని లక్షలాది ఎకరాల పంట పొలాలకు ప్రాణదానం లభించినట్లయింది.
{{/usCountry}}2015లో ప్రారంభమైన పట్టిసీమ ఎత్తిపోతల పథకం.. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంలో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. కరవు లేదా వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారీ ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అన్నదాతలను ఆదుకుంటూనే ఉంది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా సుమారు 442 టీఎంసీల గోదావరి మిగులు జలాలను కృష్ణా బేసిన్కు విజయవంతంగా మళ్లించారు. ప్రస్తుత ఎల్ నినో సంవత్సరంలోనూ ఈ జలాలు చేరడంతో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల పరిధిలోని లక్షలాది ఎకరాల పంట పొలాలకు ప్రాణదానం లభించినట్లయింది.
{{/usCountry}}