కావలిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు - రైళ్ల రాకపోకలకు అంతరాయం..!

నెల్లూరు జిల్లాలోని కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిజామాబాద్ నుంచి రేణిగుంట వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రెండు బోగీలు పూర్తిగా పట్టాలు తప్పగా… ట్రాక్  దెబ్బతిన్నది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Published on: Jan 15, 2026 10:51 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నెల్లూరు జిల్లా లో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ​కావలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. నిజామాబాద్ నుంచి రేణిగుంటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రెండు బోగీలు పట్టాలు తప్పగా… ట్రాక్ దెబ్బతిన్నది. దీంతో ​ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు,సిబ్బంది వెంటనే ​ఘటనా స్థలానికి చేరుకున్నారు. ​ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

నెల్లూరు జిల్లాలో అదుపుతప్పిన గూడ్స్ రైలు
నెల్లూరు జిల్లాలో అదుపుతప్పిన గూడ్స్ రైలు

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనా స్థలికి డివిజన్ రైల్వే అధికారులు చేరుకొని రైళ్ల పునరుద్దరణ పనులను పర్య వేక్షిస్తున్నారు. విజయవాడ - చెన్నై మార్గంలో నడుస్తున్న కొన్ని రైళ్లకు అంతరాయం కలిగింది. మధ్యాహ్నం లోగా ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అన్ని రైళ్ల రాకపోకలను తిరిగి ఆ ట్రాక్ మీదుగా వెళ్లే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

మరోవైపు గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన పైన రైల్వేశాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. సాంకేతిక సమస్యతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గుర్తించినట్లు సమాచారం. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత రైల్వేశాఖకు నివేదికను అందించనున్నారు.